వర్షంలో తడుస్తూ, అలా చేస్తే యమ కిక్కిస్తుందంటోన్న నిధిఅగర్వాల్.. తనే కాదు తన కోరికలూ హాటే..
`ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ క్రేజ్కి తగ్గ క్రేజీ పనులు చేయడమంటే నిధికి ఇష్టమట. ముఖ్యంగా వర్షంలో తడిసి ముద్దవడం చాలా ఇష్టమని చెప్పింది నిధి. అంతేకాదు తన హాట్ కోరికని బయటపెట్టింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వర్షానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వర్షం అంటే చాలా ఇష్టమని, చిన్నప్పుడు వర్షంలో తడిసి ముద్దయితే పండగే అని చెబుతోంది నిధి అగర్వాల్. ఈ సందర్భంగా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.
వర్షాకాలంలో స్కూల్కి వెళ్లడం అంటే పండగ అని, ఆ సమయంలో ఫుల్లుగా తడిసేదాన్ని అని తెలిపింది. అయితే వాళ్లమ్మ వర్షంలో తడిసేందుకు అనుమతి ఇచ్చేవారుకాదట. దీంతో తాను స్కూల్కి వెళ్లే టైమ్ని వాడుకునేదాన్ని అని తెలిపింది. ఆ సమయంలో బోట్ చేయడం.. నీళ్లల్లో వదలడం.. భలే సరదాగా అనిపించేదని తెలిపింది నిధి.
తనకు వాన బ్యాక్డ్రాప్లో వచ్చే రొమాంటిక్ సాంగ్లంటే ఇష్టమని తెలిపింది. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ నటించిన `గురు` చిత్రంలోని `బరసోరే మేఘా మేఘా.. ` పాట తనకి చాలా ఇష్టమైనదని పేర్కొంది. ఐష్ అంటే తనకు బాగా ఇష్టమని, ఆమే ఏం చేసినా నచ్చుతుందని తెలిపింది.
ఇటీవల ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు భారీ వర్షం పడిందట. షూటింగ్ లొకేషన్ నుంచి, కార్వ్యాన్లోకి వెళ్లేలోపే తడిసి ముద్దయినట్టు చెప్పింది నిధి. అంతేకాదు ఆ మధ్య ముంబయిలో ఉన్నప్పుడు భారీ వర్షం కారణంగా ఫ్లైట్ టైమింగ్ మారిందని, దీంతో కనెక్టింగ్ ఫ్లైట్లో జర్నీ చేయాల్సి వచ్చిందని, అలా ఫ్లైట్ మారడం వల్ల ఇబ్బంది పడ్డట్టు తెలిపింది.
వాన పాటలు చేయడం అంత ఈజీ కాదని, నటిస్తున్నప్పుడు తడవడం, షాట్ గ్యాప్లో ఆరడం, మళ్లీ తడవడం.. ముఖ్యంగా వాన పడుతుంటే కళ్లు తెరిచి ఉంచి, నటించడం తన వల్ల కాదని చెప్పేసింది. వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండి, కిటికిలోంచి ఆ వర్షాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేమని తెలిపింది.
`ఇస్మార్ట్ శంకర్`తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. కెరీర్ బిగినింగ్లోనే పెద్ద స్టార్తో కలిసి నటించే అవకాశం రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు `హీరో` అనే మరో సినిమాలో నటిస్తుంది.
నిత్యం గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది నిధి. అది ఎంతగా అంటూ నిధికి అభిమానులు ఏకంగా గుడి కట్టేంతగా. తమిళనాడులో అభిమానులు ఆ మధ్య నిధి విగ్రహాన్ని నిర్మించి ఆమెకి పాలాభిషేకం చేయడం వైరల్ అయ్యింది.