పెద్ద కన్ఫూజన్ లో ప్రభాస్.. ఇలా జరిగిందేంటి?
‘సాహో’ సినిమా డిజాస్టర్ కావటంతో ప్రభాస్ తన తదుపరి సినిమాని ఎట్టి పరిస్దితుల్లోనూ బాహుబలి స్దాయి హిట్ కొట్టాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రభాస్ ఎన్నో జాగ్రత్తలు తీస్కొని తన 20వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా షూటింగ్ ఆ మధ్యకాలం వరకూ శరవేగంగా జరుపుకుంది. కరోనా దెబ్బతో ప్రస్తుతం షూటింగ్ ఆపుచేసారు. అయితే ఈ సినిమా విషయమై మునిపెన్నడూ లేని విధంగా ప్రభాస్ ఫుల్ కన్ఫూజన్ లో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామా మొదలై మూడు సంవత్సరాలు అయినా ఇప్పటికీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ కాలేదు. చివరకు టైటిల్ కూడా ఖరారు చేసి ప్రకటించలేదు.
అప్పటికీ దసరా 2020కు ఈ సినిమా వస్తుందని అభిమానులు భావించారు. కానీ లాక్ డౌన్ తో అదీ జరిగే పనిలా కనపడటం లేదు. ఇది ఇఫ్పుడిప్పుడే తెమిలేలా లేదని సంక్రాంతి 2020కు అయినా తీసుకువద్దామని ప్రభాస్ తన టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు మరో ప్రక్కన వార్తలు వస్తున్నాయి.
అయితే అదే సమయంలో వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, చిరంజీవి ఆచార్య చిత్రాలు రెండు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. దాంతో మళ్లీ ప్రబాస్ వచ్చే వేసవికి రిలీజ్ కు వెళ్లాల్సిన పరిస్దితి.
అయితే అప్పటికి రాజమౌళి తన ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతారు. ఆర్ ఆర్ ఆర్ వస్తోందంటే దాదాపు నెల ముందు నుంచీ పెద్ద సినిమాలు రిలీజ్ లు పెట్టుకోరు. అలాగే రిలీజ్ అయ్యాక కూడా నెల రోజులు రిలీజ్ ఆపుకుంటారు. లేకపోతే థియేటర్స్ సమస్య వస్తుందని.
ఇలా అన్ని వైపులా ప్రభాస్ కు రిలీజ్ సమస్యలే కనపడుతున్నాయి. మరో ప్రక్క అభిమానులు ..ఈ సినిమా అప్ డేట్స్ ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. దాంతో ఏం నిర్ణయం తీసుకోవాలనే కన్ఫూజన్ లో ప్రభాస్ ఉన్నట్లు వినికిడి.
పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇక మొదట ‘జాన్’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఆ టైటిల్ లేకపోవటంతో ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ లేదా ‘ఓ డియర్’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతోంది.
ఇక లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు.
దానికి సంబంధించిన సెట్ డిజైన్ కూడా మొదలుపెట్టారట. మిగిలిన షూటింగ్ మొత్తం దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా టైమ్ సేవ్ చెయ్యడం కోసం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చేస్తోంది.