మీసం తిప్పిన నాగబాబు దుకాణం సర్దినట్టేనా... హైపర్ ఆది చెప్పిందే జరిగింది!
మెగా బ్రదర్ నాగబాబు సారథ్యంలో మొదలైన బొమ్మ అదిరింది షోకి తెరపడిందని టాక్ వినిపిస్తుంది. అనుకున్నంత ఆదరణ దక్కని నేపథ్యంలో నాగబాబు బొమ్మ అదిరింది టాక్ షోకి చరమ గీతం పాడాడని టాలీవుడ్ కోడై కూస్తుంది. గత రెండువారాలుగా బొమ్మ అదిరింది షో ప్రసారం నిలిచిపోవడమే దీనికి కారణం.
జబర్ధస్త్ షో నుండి బయటికి వచ్చిన నాగబాబు అదిరింది పేరుతో అదే తరహాలో ఓ కామెడీ షో జీ తెలుగులో ప్రారంభించారు. పోతూపోతూ జబర్ధస్త్ నిర్వాహకులపై అవాకులు చవాకులు పేల్చాడు. జబర్ధస్త్ కష్టసమయాలలో నన్ను ఆదుకుంది అంటూనే... నావలన కూడా ఆ షోకి ప్రయోజనం చేకూరింది అన్నాడు.
తనతో పాటు జబర్ధస్త్ టీమ్ లీడర్స్ చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ధనా ధన్ ధన్ రాజ్ లను మరియు జబర్ధస్త్ డైరెక్టర్స్ ని నాగబాబు అదిరింది షోకి తీసుకెళ్లారు. పరోక్షంగా జబర్ధస్త్ షోని తొక్కేస్తామని ఆయన ప్రగల్బాలు పలికారు.
మొదట తీసుకున్న యాంకర్స్ స్థానంలో శ్రీముఖిని దించాడు. జడ్జెస్ గా తనతో పాటు నటుడు నవదీప్ ని తీసుకోవడం జరిగింది. యూట్యూబ్ ప్రోమోలు, వీడియోలకు మంచి వ్యూస్ రావడంతో అదిరింది సక్సెస్ అని అందరూ అనుకున్నారు. అదిరింది షోని బొమ్మ అదిరిందిగా మార్చిన నాగబాబు, తన పలుకుబడితో బుల్లితెర సెలబ్రిటీలను తెచ్చి పాపులర్ చేయాలని చూశాడు.
అలాగే వివాదాల ద్వారా కూడా షోకి ప్రచారం తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు. సీఎం జగన్ ని ఇమిటేట్ చేస్తూ ఓ కమెడియన్ చేసిన స్కిట్ వివాదాస్పదం అయ్యింది. ఆ విషయంలో జగన్ ఫ్యాన్స్ నాగబాబుపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగారు. వాళ్ళను మరింత రెచ్చిగొడుతూ... హెయిర్ ఆయిల్ వెంట్రుక కూడా పీకలేరని మీసం తిప్పాడు.
అలా అనేక వివాదాల మధ్య నడుస్తున్న ఈ షో రేటింగ్ ఏమీ బాగోలేదని తెలుస్తుంది. దీనితో బొమ్మ అదిరింది షోని నాగబాబు నిలిపివేశాడని సమాచారం. ప్రతి ఆదివారం రాత్రి 9:00 గంటలకు ప్రసారమయ్యే ఈ షో రెండు వారాలుగా ప్రసారం కావడం లేదు. జబర్ధస్త్ మాదిరి మరో కామెడీ షో సక్సెస్ కావడం, తమ స్కిట్స్ ని బీట్ చేయడం మరొకరి వల్ల కాదన్న హైపర్ ఆది జోస్యం నిజమైనట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తున్నాడు. బొమ్మ అదిరింది ఫెయిల్ కావడంతోనే నాగబాబు, తక్కువ ఖర్చుతో నడిచే యూట్యూబ్ స్టాండప్ కామెడీ షోపై ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.