కొందరు గెలిచారు, కొందరు ఓడారు.. క్యాన్సర్తో పోరాడిన సెలబ్రిటీలు వీళ్లే!
2020 యావత్ ప్రపంచానికి ఓ పీడకల లాంటి సంవత్సరం. ముఖ్యంగా ఈ ఏడాది బాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి ఇండస్ట్రీని వణికిస్తుండగా ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్, సుశాంత్ల మరణాలు కలవరపెట్టాయి. తాజాగా మరో బాలీవుడ్ స్టార్కు క్యాన్సర్ సోకిందన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
సంజయ్ దత్ తల్లి నర్గీస్ దత్ కూడా క్యాన్సర్తోనే మరణించింది. సుధీర్ఘ కాలం పాటు క్యాన్సర్తో పోరాడిన నర్గీస్ న్యూయార్క్లో చికిత్స పొందుతూ మరణించింది.
2019 జూలైలో సోనాలి బెంద్రే హై గ్రేడ్ క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకున్నారు. ఆమె క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో తన అనుభవాల అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ వెటరన్ యాక్టర్ రిషి కపూర్ కూడా క్యాన్సర్ కారణంగానే ప్రాణాలు విడిచారు. న్యూయార్క్లో చాలా కాలం చికిత్స పొందిన రిషి, కోలుకున్నట్టుగా కనిపించినా క్యాన్సర్ తిరగబెట్టడంతో తుదిశ్వాస విడిచారు.
2016 లో ఇర్ఫాన్ ఖాన్కు న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.లండన్లో చాలా కాలం చికిత్స తీసుకున్నాడు ఇర్ఫాన్. క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలొోనే ఆయన షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. అయితే ఆ పోరాటంలో ఆయన ఓడిపోయారు. రిషీ కపూర్ మరణించడానికి ఒక్క రోజు ముందు ఇర్ఫాన్ మరణించాడు.
ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆయుష్మాన్, తాహిరా ఈ వార్తలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోరాటంలో తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది తాహిరా.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ కూడా క్యాన్సర్ బారిన పడినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
బహు భాష నటి మనిషా కొయిరాల కూడా క్యాన్సర్ బారిన పడింది. సుధీర్ఘ కాలం చికిత్స పొందిన తరువాత ఆమె కోలుకుంది.
ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా 2017లో క్యాన్సర్తోనే కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతూ మరణించారు.
బాలీవుడ్ ఫస్ట్ సూపర్స్టార్ రాజేష్ ఖన్నా కూడా కాన్సర్ కారణంగానే 2012లో తుదిశ్వాస విడిచారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సి ఉంది.