పవన్ కళ్యాణ్ కలిస్తే వంద ముద్దులు ఇస్తా... నటి సురేఖా వాణి సంచలన కామెంట్స్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్, లేడీ కమెడియన్ సురేఖా వాణీ ఈ మధ్య ఏదో విధంగా వార్తలలో నిలుస్తున్నారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ తో పాటు, కామెంట్స్, రెండో పెళ్లి వార్తలు చర్చకు దారితీస్తున్నాయి. 2019లో సురేఖా వాణి భర్త అనారోగ్యం కారణంగా మరణించారు.
భర్త మరణం తరువాత అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక సురేఖా వాణి వారి నుండి దూరంగా ఉంటున్నారు. సురేఖాకు సుప్రీత అనే టీనేజ్ డాటర్ ఉన్నారు. కూతురు సుప్రీతతో కలిసి సురేఖ చేసే ఫోటో షూట్స్, వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతూ ఉంటాయి.
ఇక ఆ మధ్య సురేఖ రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. 40ఏళ్ల సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపించాయి. అయితే ఈ వార్తలను సురేఖ ఖండించారు.
తనకు రెండో పెళ్లి ఆలోచన లేదని, వస్తున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదని ఆమె తెలియజేశారు. ముఖ్యంగా సురేఖ కూతురు సుప్రీత మీడియాపై మండిపడ్డారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సురేఖ చేసిన లేటెస్ట్ కామెంట్ వైరల్ గా మారింది.
ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న సురేఖ తన కెరీర్ , పర్సనల్ లైఫ్ గురించి అనేక విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె మెగా హీరోలపై తన అభిప్రాయం తెలియజేశారు. చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ ని అని సురేఖ తెలియజేశారు. ఆయనను చూసి చాలాసార్లు భావోద్వేగానికి గురయ్యానని ఆమె అన్నారు. ఓ సారి చిరంజీవి తనను ఇంటికి భోజనానికి పిలిచారని ఆమె గుర్తు చేసుకున్నారు.
అయితే పరిశ్రమలో ఏ హీరోకి మీరు వంద ముద్దులు ఇస్తారని అడుగగా, టక్కున పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది సురేఖ. పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టం అన్న సురేఖ ఆయనకు ముద్దులు ఇవ్వడానికి వెనుకాడను అని చెప్పడం సంచలనంగా మారింది.
ఇక హిందీలో కూడా కొన్ని చిత్రాలలో నటించినట్లు సురేఖా తెలిపారు. ఇటీవల విడుదలైన మాస్టర్ మూవీలో సురేఖ నటించడం జరిగింది. చాలా కాలంగా పలు భాషలలో అనేక భిన్నమైన పాత్రలు చేశారు సురేఖ.