హీరోయిన్ కాక ముందు డబ్బుల కోసం అలాంటి పనులు చేశాను...బన్నీ హీరోయిన్ నివేదా కామెంట్స్ వైరల్
తెలుగు, తమిళ బాషలలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. ఈ హాట్ బ్యూటీ అందానికి తగ్గ గుర్తింపు రాకపోయినా, కెరీర్ మాత్రం ఆగకుండా సాగుతుంది.
మోడలింగ్ పట్ల ఆసక్తి కలిగిన నివేదా పేతురాజ్ 2015 మిస్ ఇండియా యూఏఈ గా కంటెస్టెంట్ చేయడంతో పాటు టైటిల్ దక్కించుకున్నారు. ఇక 2016లో విడుదలైన ఒరు నాల్ కొట్టు చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యారు.
శ్రీవిష్ణు హీరోగా 2017లో విడుదలైన మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నివేదా. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే 2019లో నివేదా నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా హిట్ చిత్రాలుగా నిలిచాయి. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ బ్రోచేవారెవరురా మంచి వసూళ్లను రాబట్టి, క్లీన్ హిట్ గా నిలిచింది.
ఇక 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురంలో చిత్రంలో నివేదా సెకండ్ హీరోయిన్ గా చేశారు. బన్నీ వంటి స్టార్ నటించిన కమర్షియల్ మూవీ కావడంతో నివేదా మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.
నివేదా నటించిన రెడ్, పాగల్ చిత్రాలు విడుదల కాగా, రానా-సాయి పల్లవి జంటగా తెరకెక్కిన విరాటపర్వం మూవీలో నివేదా ఓ కీలక రోల్ చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
స్టార్ కాకపోయినా కనీసం హీరోయిన్ గా బిజీ అవ్వాలన్న ఆలోచనలో ఉన్న నివేదా.. తాను హీరోయిన్ కాకముందు ఏమి చేశారో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సొంత ఖర్చులకు అవసరమైన సంపాదన కోసం నివేదా కొన్నాళ్ళు ఓ బొటిక్ నడిపారట. అలాగే ఈవెంట్ మేనేజర్ గా అనేక ఈవెంట్స్ నిర్వహించేవారట. జాబ్ కూడా చేసిన నివేదా ఓ కార్ల కంపెనీలో పనిచేసినట్లు ఆమె వెల్లడించారు.
చక్కని రూపం, హీరోయిన్ రేంజ్ ఫీచర్స్ కలిగిన నివేదాను ఫ్రెండ్స్ హీరోయిన్ కావడానికి ప్రోత్సహించారట. సినిమాలలోకి వెళితే నీ అందానికి ఖచ్చితంగా సక్సెస్ అవుతావని ప్రేరణ ఇవ్వడంతో నివేదా పరిశ్రమ వైపు అడుగులు వేశారట.