సలార్ రిజల్ట్... నేను సంతృప్తి చెందలేదు, సలార్ 2లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్... డైరెక్టర్ కామెంట్స్
సలార్ మూవీ రిజల్ట్ విషయంలో ప్రభాస్ సంతృప్తిగా ఉన్నారు. నేను మాత్రం లేనంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సందర్భంగా ఆయన పార్ట్ 2 ఎలా ఉంటుందో హింట్ ఇచ్చాడు.
గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన సలార్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. కలెక్షన్స్ పరంగా జోరు చూపించింది. వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కథ అసంపూర్తిగా ఉందన్న వాదన వినిపించింది. తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkpx09f4t5g22hjwgp50bdtp/prabhas-prithvirajs-salaar-film-collection-report-out-creates-new-record-beats-gadar-2_300x171xt.jpg)
సలార్ మూవీలో మూడు యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. పార్ట్ 2 లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే అన్నీ కథలో అంతర్లీనంగా వస్తాయి. సలార్ రిజల్ట్ విషయంలో ప్రభాస్ సంతృప్తిగా ఉన్నారు. నేను మాత్రం లేను. నేను కెజిఎఫ్ 2 విషయంలో కూడా సంతృప్తి కాలేదు. ఒక క్రియేటర్ గా ఇంకా ఏదో చేయాలనే తపన ఉంటుంది.
కలెక్షన్స్. ఆ మ్యాజిక్ అయితే ఎప్పుడో జరిగింది. సలార్ 2 అద్భుతంగా ఉంటుంది. స్టోరీ, విజువల్స్, కలెక్షన్స్ విషయంలో అద్భుతం చూస్తారు. కెజిఎఫ్ తీస్తున్నప్పుడు కన్నడ ప్రేక్షకులను, సలార్ తీస్తున్నప్పుడు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకున్నాను. ఆ మాస్ హీరోలకు భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది గుర్తు పెట్టుకోవాలి అని చెప్పుకొచ్చారు.
సలార్ మూవీలో ఉన్న ప్రతి పాత్రకు పార్ట్ 2 లో సమాధానం, ముగింపు ఉంటాయని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. అసలు మేటర్ మొత్తం సలార్ 2లోనే ఉందని ఆయన చెప్పకనే చెప్పాడు. పార్ట్ 1 లో దేవ-వరద ప్రాణ మిత్రులుగా కనిపిస్తారు. వారు బద్ద శత్రువులు అవుతారు. వారి మధ్యే ప్రధాన సంఘర్షణ ఉంటుందని ప్రశాంత్ నీల్ అన్నారు.
సలార్ చిత్రంలో ప్రభాస్ ప్రాణమిత్రుడిగా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహ, ఈశ్వరరావు కీలక రోల్స్ చేశారు.