Shriya Saran: అవమానాలకు భయపడి ప్రెగ్నెన్సీ మేటర్ దాచాను!
అవమానాలకు భయపడి గర్భవతి అయిన విషయాన్ని దాచానని శ్రియ శరన్ చెప్పడం షాకింగ్ మారింది. గర్భవతిగా అలాంటి ఒత్తిడికి గురి కావడం ఇష్టం లేక ఇలా చేశానని వివరణ ఇచ్చారు.
Shriya Saran
స్టార్ లేడీ శ్రియ ప్రెగ్నెన్సీ విషయం దాచిన విషయం తెలిసిందే. ఆమె 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ ని వివాహం చేసుకున్నారు. సడన్ గా తనకు కూతురు ఉన్నట్లు చెప్పి బాంబు పేల్చింది. శ్రియ అసలు గర్భవతి ఎప్పుడయ్యారని ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు.
Shriya Saran
2021 జనవరి 10న శ్రియకు అమ్మాయి పుట్టింది. ఈ విషయాన్ని ఆమె 10 నెలల తర్వాత 2021 అక్టోబర్ లో తెలియజేశారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ గర్భం దాల్చారు. 2020లో ఏడాది పాటు పూర్తిగా లాక్ డౌన్ నడిచింది. షూటింగ్స్, మీటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి.
ప్రొఫెషన్ కి కూడా బ్రేక్ వచ్చిన నేపథ్యంలో శ్రియ తన ప్రెగ్నెన్సీ రివీల్ చేయలేదు. రహస్యంగా బిడ్డను కన్నారు.పెళ్లైన శ్రియ(Shriya Saran) గర్భవతి అయిన విషయం దాల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎట్టకేలకు శ్రియ ఆ సంగతి బయటపెట్టారు.
Shriya Saran
గర్భం దాల్చడం వలన శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా బరువు పెరిగి లావు కావచ్చు. బరువు పెరగడం అనేది సామాన్యులకు చిన్న విషయమే. కానీ సెలబ్రిటీల విషయంలో దాన్ని భిన్నంగా చూస్తారు. ప్రెగ్నెన్సీ, డెలివరీ కారణంగా నేను లావైతే బాడీ షేమింగ్ కి గురి కావచ్చు. అవన్నీ మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాయి.
బాడీ షేమింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్ కి భయపడి నేనుప్రెగ్నెన్సీ విషయం బయటకు చెప్పలేదు. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాను.. అంటూ శ్రియ వివరణ ఇచ్చారు. శ్రియ లేటెస్ట్ మూవీ దృశ్యం 2(హిందీ) ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర సక్సెస్ మీట్లో ఈ విషయాలు వెల్లడించారు.
స్టార్ హీరోయిన్ గా శ్రియ హైట్స్ చూశారు. రెండు తరాల సూపర్ స్టార్స్ తో నటించిన ఘనత శ్రియ సొంతం. ప్రస్తుతం తెలుగులో శ్రియ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.అయితే ఆమెకు బాలీవుడ్ లో వయసుకు తగ్గ పాత్రలు రావడం విశేషం. సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో(RRR Movie) శ్రియా నటుడు అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిశారు.
కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశారు. గొప్ప డాన్సర్ అయిన శ్రియ అప్పట్లో అబ్బాయిల కలల రాణిగా వెలిగిపోయారు. ఇటీవల శ్రియ ప్రధాన పాత్రలో గమనం టైటిల్ తో మూవీ విడుదలైంది.గమనం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం. నటన పరంగా కూడా అద్భుతం చేయగల శ్రియ మరికొంత కాలం నటించాలని, అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.