‘రంగమ్మత్త’ రోల్ చేయడానికి ఒప్పుకోని ఆ సీనియర్ హీరోయిన్... అనసూయ కంటే ముందు...
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ‘రంగస్థలం’. కమర్షియల్గానే కాకుండా, నటుడిగా కూడా చెర్రీకి మంచి పేరు తెచ్చిపెట్టిన ‘రంగస్థలం’ మూవీ, రంగమ్మత్తగా నటించిన అనసూయకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అయితే వాస్తవానికి రంగమ్మత్త రోల్ కోసం మొదట అనుకున్నది అనసూయను కాదట...
‘జబర్ధస్త్’ షో ద్వారా హాట్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు ‘రంగస్థలం’ మూవీ కారణంగా ‘రంగమ్మత్త’ అనే నిక్నేమ్ కూడా ఫిక్స్ అయిపోయింది. చాలామంది అనసూయను ‘రంగమ్మత్త’ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు.
రంగమ్మత్త పాత్రకు వచ్చిన గుర్తింపు, క్రేజ్ కారణంగానే, ‘రంగస్థలం’ సినిమా తర్వాత అరడజను పైగా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది అనసూయ... అయితే వాటిల్లో ఏదో సరైన సక్సెస్ అందుకోలేదు...
అయితే ‘రంగమ్మత్త’ క్యారెక్టర్కి ముందుగా అనుకున్నది అనసూయను కాదు, సీనియర్ హీరోయిన్ రాశిని. డైరెక్టర్ సుకుమార్, ‘రంగమ్మత్త’ పాత్రకు రాశి అయితే కరెక్టుగా సెట్ అవుతుందని భావించారట...
హీరోయిన్ రాశికి కథ వినిపించడం, ఆమెకు ఆ పాత్ర నచ్చడం కూడా జరిగిపోయాయి. అయితే 1980ల్లో గ్రామీణ మహిళ వేషధారణకు తగ్గట్టుగా మోకాళ్ల దాకా చీర చుట్టుకుని, గ్లామర్ ఒలింకించే సీన్లలో నటించడానికి రాశి ఒప్పుకోలేదు...
1990ల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, శ్రీకాంత్, వెంకటేశ్, జగపతిబాబు, వన్డే నవీన్, జేడీ చక్రవర్తి వంటి ఎందరో హీరోల సరసన నటించిన రాశి, మహేష్ బాబు ‘నిజం’ సినిమాలో విలన్గా నటించింది.
తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నిజం’ మూవీలో గోపీచంద్కి ప్రియురాలిగా నటించి, టూ హాట్ సీన్లలో నటించింది. అయితే ఆమె నటించిన చాలా సీన్లను ఎడిటింగ్లో కత్తిరించారని, ఆయన చెప్పింది ఒకటీ, తీసింది ఒకటని తెగ ఫీలైపోయింది రాశి...
‘నిజం’ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్తో పాటు ఓ బిడ్డకు తల్లైన రాశి, గ్లామర్ ఒలింకించే పాత్రల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగానే ‘రంగమ్మత్త’ పాత్రను వదులకుందని టాలీవుడ్ వర్గాల టాక్...
రాశి వదులుకున్న పాత్ర, అలా అలా అనసూయకి చేరి... ఆమె కెరీర్కి టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ సినిమా తర్వాత ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమాల్లో లీడ్ రోల్లో నటించిన అనసూయ, మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లోనూ నటిస్తోంది...
ఈ సినిమాతో పాటు అల్లుఅర్జున్ ‘పుష్ఫ’, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ మార్తాండ’, రవితేజ ‘కిలాడీ’ సినిమాల్లో నటిస్తున్న అనసూయ, ‘భీష్మ పర్వం’ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది.
సెకండ్ ఇన్నింగ్స్లో సీరియల్స్ చేస్తూ గడిపేస్తున్న రాశి, ఈ పాత్రలో నటించి ఉంటే, ఆమె కెరీర్ మరో టర్న్ తీసుకుని ఉండేదని అంటున్నారు విశ్లేషకులు. అయితే అలాంటి రోల్ రావడం కూడా అనసూయ అదృష్టం అంటున్నారు ‘జబర్ధస్త్’ యాంకర్ ఫ్యాన్స్...