మంచి మనిషిగా ఉంటాను... కొత్త ఏడాది వేళ ఆసక్తి రేపుతున్న మెగా కోడలు లావణ్య పోస్ట్!
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కోడలు న్యూ ఇయర్ వేళ మూడు ప్రతిపాదనలు పెట్టుకుంది. వాటినే ఫాలో అవుతుందట.
Varun Tej
నార్త్ భామ లావణ్య త్రిపాఠి తెలుగింటి కోడలు అయ్యారు. ఆమె హీరో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ లో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ల వివాహం ఘనంగా జరిగింది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. మూడు రోజులు వైభవంగా పెళ్లి జరిగింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hf5n6mw9px3ys4se4ffmrh4y/179637b0-a40f-42c5-b230-0c67e7340441-jpg_300x450xt.jpg)
ఈ పెళ్ళికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. దీంతో నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వరుణ్, లావణ్యలు పెళ్లి బంధం లోకి అడుగుపెట్టారు. వివాహం అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ గా మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
పెళ్లి చేసుకున్న లావణ్య నటనకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించలేదు. ఆమె నిర్మాతగా మారతారనే ప్రచారం ఉంది. దీనిపై అధికారిక సమాచారం లేదు.
Varun Tej
ఇక నూతన సంవత్సరం వేళ లావణ్య త్రిపాఠి మూడు రెసొల్యూషన్స్ తెరపైకి తెచ్చింది. 2024లో ఆ మూడు నియమాలు పాటిస్తుందట. వాటిలో మొదటిగా 'మంచి మనిషిగా ఉండాలి' అనుకుంటుందట. ఇక రెండో నియమం ఏమిటంటే... తనని తాను ప్రేమించుకుంటుందట.
ఇక మూడో ప్రతిపాదన విషయానికి వస్తే... సోషల్ మీడియాలో గడపకూడదు. ఆ సమయాన్ని తగ్గించాలి అనుకున్నారట. 2024లో ఈ మూడు పాటిస్తాను, అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. అలాగే 2023కి ఆమె కృతఙ్ఞతలు చెప్పారు. లావణ్య త్రిపాఠి పోస్ట్ వైరల్ అవుతుంది.