రెండో బిడ్డ విషయంలో ఉపాసన కీలక నిర్ణయం! ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గత ఏడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా రెండో బిడ్డ విషయంలో ఉపాసన తీసుకున్న ఓ నిర్ణయం మెగా ఫ్యాన్స్ లో చర్చకు దారి తీసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Ram Charan - Upasana
2023 మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం. ఆ కుటుంబంలోకి కొత్త సభ్యురాలు వచ్చింది. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ప్రసవించింది. కూతురుకి క్లిన్ కార అని పేరు పెట్టారు.
క్లిన్ కార రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. పలు శుభ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నింటికీ మించి రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. క్లిన్ కార జననం చాలా స్పెషల్ అని చెప్పాలి. కారణం... పెళ్ళైన పదేళ్లకు క్లిన్ కార పుట్టింది. 2012లో ఉపాసన-రామ్ చరణ్ వివాహం కాగా 2023లో తల్లిదండ్రులు అయ్యారు.
ఒక దశలో రామ్ చరణ్-ఉపాసనలకు పిల్లలు పుట్టరంటూ పలు పుకార్లు, ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఏదైనా సమస్య ఉందా? అని ఉపాసనను సన్నిహితులు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయట. పిల్లల్ని కనడం ఒక బాధ్యత. అందుకు పూర్తిగా సన్నద్ధం అయ్యాకే పేరెంట్స్ కావాలని కోరుకున్నట్లు ఉపాసన ఓ సందర్భంలో చెప్పారు.
Upasana Konidela
ఇన్నేళ్లకు ఓ బిడ్డను కన్న ఉపాసన... రెండో బిడ్డను ఎప్పుడు కంటుందనే సందేహాలు ఉన్నాయి. దీనిపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె ఒకింత గుడ్ న్యూస్ చెప్పింది. సెకండ్ చైల్డ్ ని వెంటనే ప్లాన్ చేస్తున్నాం అన్నారు. అందుకు ఆమె సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఉపాసన మాట్లాడుతూ... నేను ఆలస్యంగా పిల్లల్ని కనాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తర్వాత క్లిన్ కారను కన్నాను. ఈ విషయంలో ఎవరెంత ఒత్తిడి పెట్టినా భరించాను. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకు బాధ లేదు. అది పూర్తిగా నా ఇష్టం. అయితే సెకండ్ చైల్డ్ ని కనేందుకు సిద్ధంగా ఉన్నాను... అన్నారు.
కాబట్టి ఉపాసన-రామ్ చరణ్ రెండో బిడ్డను కనేందుకు సంసిద్ధంగా ఉన్నారన్న మాట. మరోవైపు మెగా ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఈసారైనా అబ్బాయి పుట్టాలని. చిరంజీవి, రామ్ చరణ్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు రావాలని కోరుకుంటున్నారు.