గ్రీన్ ఇండియా ఛాలెంజ్... సిప్లిగంజ్ ఛాలెంజ్ స్వీకరించిన విశ్వక్ సేన్
ప్రముఖ టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.
హైదరాబాద్: తెలంగాణలో పచ్చదనాన్ని పెంచే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో సినీ హీరో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. 3వ విడత ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మొక్కను నాటి విశ్వక్ కు ఛాలెంజ్ విసిరారు.
ఈ ఛాలెంజ్ స్వీకరించిన నటుడు విశ్వక్ సేన్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న జిహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ...మనిషి బ్రతకడానికి మొక్కలు ఎంతో అవసరమని అన్నారు.ఎంపీ సంతోష్ కుమార్ చొరవ తీసుకొని గ్రీన్ ఛాలెంజ్ చేయడం చాలా గొప్ప పని అన్నారు.
అనంతరం హీరోలు అల్లు శిరీష్,కార్తికేయ, డైరెక్టర్ శైలేష్, అభినవ్ గోమటం నలుగురికి ఛాలెంజ్ విసిరారు విశ్వక్ సేన్. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ పాల్గొన్నారు.