ఆన్లైన్లో చూసి సెక్స్ టాయ్ వాడటం నేర్చుకున్నా: మహేష్ హీరోయిన్
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ కియారా అద్వానీ. తరువాత లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్లో వైబ్రేటర్ వాడే సన్నివేశంలో నటించిన అందరికీ షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.
లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్తో అందరి దృష్టినీ ఆకర్శించిన కియారా అద్వానీ, ఆ షోలో వైబ్రేట్ వినియోగించే సన్నివేశంతో సంచలనం సృష్టించింది. అయితే ఆ సన్నివేశం కోసం తాను ఎలా ప్రీపేర్ అయిన విషయం కూడా వెల్లడించింది కియారా.
నెట్ఫ్లిక్స్లో ప్రసారం అయిన లస్ట్ స్టోరీస్ విమర్శకులు ప్రశంసలతో పాటు, కమర్షియల్గా కూడా విజయం సాధించింది. అంతేకాదు కియారా నటించిన వైబ్రేటర్ సీన్ అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఈ షోలో కియారా మేఘ అనే గృహిణి పాత్రలో కనిపించింది. పెళ్లి తరువాత చాలా కాలం పాటు సాటిస్ఫ్యాక్షన్ లేక ఇబ్బందులు పడే పిత్రలో ఆమె కనిపించింది. ఆమె భర్తగా విక్కీ కౌషల్ కనిపించాడు.
ఆ షో తరువాత నేహ దుపియా చాట్ షోలో పాల్గొన్న కియారా ఆ సన్నివేశం కోసం తాను ఎలా ప్రీపేర్ అయ్యిందో కూడా వెల్లడించింది. ఆ సన్నివేశంలో నటించే ముందు రోజు రాత్రి తాను ఎంతో నెర్వస్ అయ్యానని చెప్పింది. మహిళలు వైబ్రేటర్ ఎలా వాడతారో గూగుల్ చేసి తెలుసుకున్నానని వెల్లడించింది. అగ్లీ ట్రూత్ లాంటి కొన్ని సినిమాల్లో సన్నివేశాలను కూడా చూశానని చెప్పింది.
ఇక సినిమాల విషయానికి వస్తే కియారా నెక్ట్స్ కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ షేర్షా, లక్ష్మీ బాంబ్ సినిమాల్లో అక్షయ్ కుమార్తో కలిసి నటిస్తోంది.