బాబోయ్... ఫ్యాన్ అడిగాడని, ఎవరూ చూడని మచ్చ చూపించిన దిశా పటాని!
ఇక గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండడం ద్వారా తమ ఫేమ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా చాట్స్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ తో తమ అభిరుచులు పంచుకుటున్నారు. అదే సమయంలో తమ పట్ల ఫ్యాన్స్ అభిప్రాయం తెలుసుకుంటున్నారు.
అయితే ఇదే అదనుగా కొందరు ఆకతాయి ఫ్యాన్స్ స్టార్స్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అడగకూడని ప్రశ్నలతో ఇరుకునబెడుతూ ఉంటారు. కొందరు సంయమనంతో వారికి రిప్లై ఇస్తే, మరికొందరు కోప్పడతారు.
తాజాగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటానికి ఓ ప్రశ్న ఎదురైంది. ఓ ఫ్యాన్ ఇతరులకు మీకు మధ్య బేధం ఏమిటని అడిగాడు. దానికి దిశా తన కంటికి క్రింద ఉన్న పుట్టు మచ్చ ఫోటో తీసి పంపారు.
అంటే తనకు కంటి క్రింద పుట్టు మచ్చ ఉందని, మిగతా వాళ్లకు ఉండదు, అదే డిఫరెన్స్ అన్నట్లు దిశా పటాని అన్నారన్న మాట. ఏదో ఇరుకునపెడదాం అని అడిగిన ప్రశ్నకు దిశా తెలివిగా సమాధానం చెప్పారు.
ఇక హీరోయిన్ గా దిశా పటాన్ కెరీర్ టాలీవుడ్ లోనే మొదలైంది. వరుణ్ హీరోగా పూరి తెరకెక్కించిన లోఫర్ మూవీతో దిశా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
ఆ సినిమా తరువాత బాలీవుడ్ కే పరిమితమైన దిశా పటాని, అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న రాధే మూవీలో దిశా హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే మరికొన్ని హిందీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
ఉన్నాయి. ఇక యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు.
తరచుగా ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ, ఎంజాయ్ చేస్తుంటారు ఈ జంట.