అందుకే బిగ్బాస్4లోకి రాలేదు.. అక్కడే సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నః అనుష్క
కరోనా సమయంలో బయటకు వెళ్ళడం అంత మంచిది కాదని, అందుకే తాను `బిగ్బాస్4`లో అతిథిగా పాల్గొనలేకపోయానని అంటోంది స్వీటీ అనుష్క. ఆమె ప్రస్తుతం `నిశ్శబ్దం` సినిమాలో నటించింది. ఇది అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుష్క అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీపాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ సినిమా గురించి మంగళవారం స్వీటీ మీడియాతో ఆన్లైన్లో మాట్లాడుతూ, తన పాత్ర నచ్చే ఒప్పుకుందట. తాను మూగగా నటించడం ఓ ఛాలెంజ్గా భావించి చేశానని తెలిపింది.
ఇంకా అనుష్క చెబుతూ, `భాగమతి` సినిమా తర్వాత కావాలనే గ్యాప్ తీసుకుందట. ఆ సమయంలో ఈ కథ తన వద్దకు వచ్చిందని, నా పాత్ర డిఫరెంట్గా ఉండటం వల్లే ఒప్పుకున్నానని తెలిపింది. అనుకోకుండా ఈ సినిమా చేశానని పేర్కొంది.
ఇందులో తన పాత్రలో ఉండే మూగ, చెవిటి అనే ప్రత్యేకతే తనని నటించేలా చేసిందట. మూగ సైన్ లాంగ్వేజ్ కోసం కొన్నాళ్ళు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ని, ఆ తర్వాత అమెరికా సైన్ లాంగ్వేజ్ని నేర్చుకుందట. అంతర్జాతీయంగా వాడే భాషనే నేర్చుకున్నానని తెలిపింది. ఓ 14ఏళ్ళ పాప తనకు సైన్ లాంగ్వేజ్ నేర్పించిందట.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీని స్వాగతించాలి. అత్యవసరం కూడా. అయితే ఫస్ట్ టైమ్ నా సినిమా ఓటీటీలో విడుదల కావడం విచిత్రంగా, కొత్తగా ఉంది. అయితే థ్రిల్లర్ సినిమాలకు సౌండ్ ముఖ్యం. ఓటీటీలో ఉన్న డ్రాబ్యాక్ అదొక్కటే. థియేటర్లో అయితే ఫుల్ సౌండ్తో ఆ థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎక్స్ పీరియెన్స్ ని ఆడియెన్స్ పొందుతారు. ఆ కిక్ ఓటీటీలో రాదు.
చాలా గ్యాప్తో మాధవన్తో నటించడం ఆనందంగా ఉంది. ఆయనతో పనిచేయడం వండర్ఫుల్ ఎక్స్ పీరియెన్స్. మా ఇద్దరివి ఇందులో సవాల్తో కూడిన పాత్రలు. అలాగే మిగిలిన పాత్రలకు ప్రయారిటీ ఉంటుంది. దర్శకుడు హేమంత్ బాగా డీల్ చేశాడు. నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, అలాగే కోన వెంకట్ బాగా సపోర్ట్ చేశారు.
కరోనా కారణంగా ఈ సినిమా ప్రమోషన్కి రానని అనుష్క చెప్పిందట. కానీ రాకపోతే కష్టమవుతుందని నిర్మాతలు ఫోర్స్ చేయడం, రిక్వెస్ట్ చేయడంతో కేవలం ఆన్లైన్ ప్రమోషన్ మాత్రమే చేస్తానని చెప్పిందట.
ఇక `బిగ్బాస్4`లో గెస్ట్ హోస్ట్ గా అనుష్క రాబోతుందని వచ్చిన వార్తలపై ఆమె స్పందిస్తూ కరోనా కారణంగానే అని తెలిపింది.