సక్సెస్తో చంపేసి, స్మైల్తో పాతిపెట్టండంటోన్న ప్రియమణి.. `ఢీ` భామ పోస్ట్ కి నెటిజన్ల మైండ్ బ్లాక్
`ఢీ` అందం ప్రియమణి కిల్లింగ్ పోస్ట్ పెట్టింది. సక్సెస్తో చంపేసి, తన స్మైల్తో పాతిపెడుతుందట. నయా గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ పంచుకుంటూ ఈ అందాల సోయగం మైండ్ బ్లాక్ కామెంట్ చేసింది.
ప్రియమణి `ఢీ` షో కోసం గ్లామర్ పిక్స్ తో కిర్రాక్ పుట్టిస్తుంది. తాజాగా ఆమె ఓ ట్రెడిషనల్ లుక్లో వాహ్ అనిపించింది. కిల్లింగ్ లుక్స్ తో నెటిజన్లని చంపేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ప్రియమణి అద్బుతమైన డాన్సర్ అనే విషయం తెలిసిందే. `ఢీ` షోలో పలు మార్లు ఆ విషయాన్ని నిరూపించుకుంది. మరోవైపు సినిమాల్లోనూ అదిరిపోయే డాన్స్ లతో కిర్రాక్ పుట్టిస్తుంది.
ఇటీవల వెంకటేష్ సరసన `నారప్ప` చిత్రంలో నటించింది ప్రియమణి. వెంకీతో ఆమెకిది తొలి సినిమా. ఇదొక డ్రీమ్ లాంటి చిత్రమని తెలిపింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది.
మరోవైపు `విరాటపర్వం` చిత్రంలో నక్సల్గా నటిస్తుంది. `మైదాన్` చిత్రంలో అజయ్ దేవగన్తో నటిస్తుంది. వీటితోపాటు మూడు కన్నడ చిత్రాలు, రెండు తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది ప్రియమణి.
`ఎవరు ఆటగాడు` అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది ప్రిమయణి. ఆ తర్వాత తమిళం,మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కార్తి నటించిన `పరుథివీరన్` చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
పాత్ర ఏదైనా అందలోకి పరకాయ ప్రవేశం చేసి రక్తికట్టించడం ప్రియమణి స్టయిల్. అందుకే ఆమెకి జాతీయ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలు కూడా ఒక్కోటి ఒక్కో విభిన్న నేపథ్యానికి చెందినవి కావడం ఓ విశేషమైతే, అందులో ప్రియమణి పాత్రలు సైతం విలక్షణతతో కూడినవి కావడం మరో విశేషం.
ప్రస్తుతం ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్లు, ఇంకోవైపు టీవీ షోస్తో బిజీగా ఉంది ప్రియమణి. ఆ మధ్య ఆమె నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ నేషనల్ వైడ్గా ప్రశంసలందుకుంది. సూపర్ హిట్ అయ్యింది.
ప్రియమణి గ్లామర్ ఫోటోలు.
ప్రియమణి గ్లామర్ ఫోటోలు.