- Home
- Entertainment
- అమరన్ డైరెక్టర్ తో ధనుష్ కొత్త సినిమా, మరో బయోపిక్ చేయబోతున్న రాజ్ కుమార్ పెరియాసామి
అమరన్ డైరెక్టర్ తో ధనుష్ కొత్త సినిమా, మరో బయోపిక్ చేయబోతున్న రాజ్ కుమార్ పెరియాసామి
సౌత్ ఇండియాన్ స్టార్ హీరో ధనుష్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. అమర్ సినిామాతో పాన్ ఇండియా దృష్టిని ఆకర్శించిన రాజ్ కుమార్ తో ధనుష్ సినిమా చేయబోతున్నాడు. ఇంతకీ ఈమూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Dhanush New Movie D55 with Amaran Director : ధనుష్ తమిళంలో బిజీ యాక్టర్గా, డైరెక్టర్గా కూడా ఉన్నాడు. తను డైరెక్ట్ చేసిన మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది.ఈ సినిమాతో తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేశాడు దనుష్.
D55 మూవీ టీమ్
ధనుష్ చేతిలో టాలీవుడ్ నుంచి కుబేరా మూవీ కూడా ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. నాగార్జున ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. జూన్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
Also Read: కేబీసీ కి గుడ్ బై చెప్పిన అమితాబ్ బచ్చన్, ఎందుకు బిగ్ బీ ఈ నిర్ణయం తీసకున్నారు?
D55 మూవీ అప్డేట్
ధనుష్ ఇప్పుడు హిందీలో రాంజనా సీక్వెల్లో నటిస్తున్నాడు. ఇది అయిపోగానే రాజ్కుమార్ పెరియసామితో సినిమా ఉంటుంది. దీనికి D55 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. రాజ్ కుమార్ పెరియసామి రీసెంట్ గా బ్లాక్ అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగ ానటించిన ఈసినిమా మేజర్ ముకుంద వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కింది.
Also Read: మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా
D55 మూవీ షూటింగ్ అప్డేట్
ఈ సినిమాను మధురై అన్బుచెళియన్ కూతురు ప్రొడ్యూస్ చేస్తోంది. జూన్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇది బయోపిక్ అయ్యే ఛాన్స్ ఉంది. నటీనటుల సెలక్షన్ జరుగుతోంది. మరి ఈ సినిమా ఎవరి బయోపిక్ గా తెరకెక్కిస్తారు అనేది చూడాలి.