సుశాంత్ వాడిన టెలిస్కోప్ రేటు తెలిస్తే షాక్ అవుతారు!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి 14 రోజులు గడుస్తున్న కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆ షాక్ నుంచి కోలేకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్కు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకొని ఆవేదన చెందుతున్నారు అభిమానులు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణంతో బాలీవుడ్లోని చీకటి కోణాలు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోని నెపోటిజం కారణంగానే సుశాంత్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్న టాక్ వినిపించింది.
అయితే సుశాంత్ మరణం తరువాత ఆయనకు సంబంధించిన కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సుశాంత్కు ఎలాంటి ఆర్ధిక సమస్యలు లేవని ఆయన సొంతంగా పలు కంపెనీలను ప్రారంభించే ఆలొచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు సుశాంత్ తండ్రి. సుశాంత్ కు సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉండేదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం సుశాంత్ లో ఎక్కువగా ఉండేదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఈ మేరకు పలు పుస్తకాలు వస్తువులను కూడా సుశాంత్ సేకరించాడని తెలుస్తోంది.
అయితే సుశాంత్ మృతి తరువాత అతని ఫ్లాట్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం టెలిస్కోప్. అంతరిక్షాన్ని మరింత దగ్గరగా చూసేందుకు సుశాంత్ కాస్ట్లీ టెలిస్కోప్ను ఖరీదు చేశాడు. దీని ధర దాదాపు 55 లక్షల రూపాయలు ఉంటుందని సుశాంత్ తండ్రి వెల్లడించాడు.
ఈ టెలిస్కోప్ను సుశాంత్ పేరిట ఏర్పాటు చేస్తున్న మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. సుశాంత్ మరణం తరువాత కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుశాంత్ పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేయటంతో పాటు తన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.