త్వరలోనే పెళ్ళి అన్నారు.. అంతలోనే షాక్ ఇచ్చారు!
టాలీవుడ్లో ఇటీవల అఖిల్, ఆ తర్వాత తరుణ్ పెళ్లిళ్ళు చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. అయితే వీరిద్దరు గతంలోనే పెళ్ళికి సిద్ధపడి బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా పెళ్ళి వరకు వెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.
నాగార్జున తనయుడు అఖిల్ మూడేళ్ళ క్రితం డిజైనర్ శ్రేయా భూపాల్తో వివాహానికి సిద్దమయ్యారు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టడంతో నాగార్జున కూడా ఓకే చెప్పారు. శ్రేయా భూపాల్తో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. అన్నయ్య నాగచైతన్య కంటే ముందే అఖిల్ వివాహం జరగబోతుందనే వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏమో..ఈ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయంలో నాగార్జునపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అఖిల్ మ్యారేజ్ని సమంత సెట్ చేస్తున్నట్టు టాక్.
తెలుగు చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్గా పేరు తెచ్చుకున్న తరుణ్..హీరోయిన్ ఆర్తి అగర్వాల్తో ప్రేమాయణం నడిపించాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. పెళ్ళి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆర్తి ఆగర్వాల్ మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకుంది. మళ్ళీ సినిమాల్లో రాణించాలని, సన్నగా మారేందుకు ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. దీంతో తరుణ్ సైతం కెరీర్ పరంగా బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం పెళ్ళి తరుణ్ రెడీ అవుతున్నారట.
గతంలో లవర్ బాయ్గా యూత్లో,ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకున్న ఉదయ్ కిరణ్.. మెగాస్టార్ చిరంజీవి తనయ సుస్మిత ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఎంగేజ్మెంట్ కూడా కుదుర్చుకున్నారు. మ్యారేజ్కి రెడీ అవుతున్న క్రమంలో ఉన్నట్టుండి వీరి మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింది. దీని వెనకాల చిరంజీవినే ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఉదయ్ కెరీర్ పరంగా ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకున్నారు.
మరోవైపు తమిళ హీరో విశాల్, అనీషాలు కూడా గతేడాది ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఏమైందో ఏమో కొద్దిరోజులకే వీరి మ్యారేజ్ క్యాన్సిల్ అయినట్టు వార్తలొచ్చాయి. అనీషా కొన్ని సినిమాల్లో నటిగానూ నటించింది.
సౌత్లో నయనతార, ప్రభుదేవా లవ్ స్టోరీ తెలియని వారంటూ లేరు. వీరిద్దరు పెళ్ళికి సిద్ధమయ్యారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఉన్నట్టుండి మ్యారేజ్కి బ్రేకప్ చెప్పుకున్నారు. అంతకు ముందు నయనతార శింబుతో బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్, క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక మందన్నా కూడా మ్యారేజ్కి బ్రేకప్ చెప్పుకుంది. ఆమె కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ టాలీవుడ్లో ఆమెకి వరుసగా హిట్స్ రావడం, ఇమేజ్ పెరగడం, అవకాశాలు క్యూ కట్టడంతో రష్మిక.. రక్షిత్కి గుడ్బాయ్ చెప్పినట్టు టాక్.
మరో హీరోయిన్ త్రిష సైతం తన మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంది. వరుణ్ మనియన్ ని పెళ్ళి చేసుకునేందుకు రెడీ అయి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న త్రిష మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా ఇద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. త్రిష ఇంకా పెళ్ళి చేసుకోలేదు.
అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి సైతం పెళ్ళి వరకు వెళ్ళారు. ఆ తర్వాత ఉన్నట్టుండి మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అక్షయ్.. ట్వింకిల్ ఖన్నాని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే.