- Home
- Entertainment
- Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్ బ్లాక్ బస్టర్తో ట్రెండ్ సెట్ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?
Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్ బ్లాక్ బస్టర్తో ట్రెండ్ సెట్ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన కథతో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ కొట్టారు. చిరంజీవి భయపడి నో చెబితే సూపర్ స్టార్ డేర్ చేసి ట్రెడ్ సెట్టర్గా నిలిచారు. మరి ఆ కథేంటో చూద్దాం.

చిరంజీవి వదిలేసిన మూవీతో రజనీకాంత్ ట్రెండ్ సెట్టర్
చిరంజీవి కెరీర్లో చాలా సినిమాలు మిస్ చేసుకున్నారు. అందులో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇండియన్ సినిమాని షేక్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. అలానే ఒక మంచి బ్లాక్ బస్టర్ని వదులుకున్నారు. తన కెరీర్లో మొదటి సారి ఒక హర్రర్ ఫిల్మ్ ని ఆయన రిజెక్ట్ చేశారు. ఇదే సినిమాని రీమేక్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ట్రెండ్ సెట్ చేశారు.
కమర్షియల్ సినిమాకి కేరాఫ్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి యాక్షన్, కమర్షియల్ సినిమాలకు కేరాఫ్. టాలీవుడ్ లెక్కలు మార్చిన హీరోగా చెప్పొచ్చు. పరిశ్రమ ని కమర్షియల్ బాట పట్టించిన హీరోగా నిలిచారు. ఎన్టీఆర్ తర్వాత కమర్షియల్ సినిమాలు చేసిన హీరోగా చిరంజీవి నిలుస్తారు. అదే సమయంలో కృష్ణ కూడా ఇలాంటి సినిమాలు చేశారు, కానీ ఆయన్ని మించేలా చిరంజీవి ఫక్తు కమర్షియల్ మూవీస్తో కాసుల వర్షం కురిపించారు. చిరంజీవితో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ అనే టాక్ అప్పట్లో ఉండేది. ఆయన చేసిన సినిమాలు కూడా అదే స్థాయిలో వసూళ్లని రాబట్టాయి.
హర్రర్ భయంతో చంద్రముఖిని రిజెక్ట్ చేసిన చిరంజీవి
ఇదిలా ఉంటే చిరంజీవి ఎక్కువగా కమర్షియల్ మూవీస్తోనే విజయాలు అందుకున్నారు. ఆయన చేసిన ప్రయోగాత్మక చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి.కానీ కమర్షియల్గా నష్టాలను తీసుకొచ్చాయి. మైథాలజీ మూవీస్, ఫాంటసీ చిత్రాలు కూడా ఆయనకు కలిసి రాలేదు. సైరా నరసింహా రెడ్డి లాంటి మూవీస్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే టాలీవుడ్లోనే ఒక ట్రెండ్ సెటింగ్ ఛాన్స్ చిరంజీవికి వచ్చింది. ఆయన భయపడి సినిమా చేయలేదు. అదే `చంద్రముఖి`. ఈ మూవీ మలయాళంలో వచ్చిన `మనితిట్రతజు` అనే చిత్రానికి రీమేక్. అందులో మోహన్లాల్, సురేష్ గోపీ, శోభన నటించారు. అక్కడ పెద్ద హిట్ అయ్యింది.
చంద్రముఖితో హర్రర్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన రజనీకాంత్
ఈ సినిమాని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేయాలని దర్శకుడు వీఎన్ ఆదిత్య ప్లాన్ చేశారు. చిరంజీవి వద్దకు వెళ్లి కథ చెప్పగా, ఆయన భయపడి రిజెక్ట్ చేశారు. తనకు ఈ హర్రర్ మూవీ సెట్ కాదని చెప్పి ఆయన నో చెప్పారు. ఆ తర్వాత ఇదే కథ సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు వెళ్లింది. కథలో కొన్ని మార్పులు చేసి `చంద్రముఖి`గా రీమేక్ చేశారు. రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార వంటి వారు నటించారు. నయనతార నటించిన తొలి చిత్రమిదే. ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తమిళంలోనే కాదు, తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. చంద్రముఖితో హర్రర్ సినిమాల ట్రెండ్ స్టార్ అయ్యింది. ఇలా రజనీకాంత్ సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు.
చిరు, రజనీకాంత్ చేస్తున్న సినిమాలివే
హర్రర్ సినిమా అని చెప్పి చిరంజీవి భయపడ్డారు. బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నారు. రజనీకాంత్ డేర్ చేసి మూవీ చేశారు, ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక చిరంజీవి ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది. మరోవైపు చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర` వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు రజనీకాంత్ ఇప్పుడు `జైలర్ 2`తో బిజీగా ఉన్నారు. అలాగే `ధర్మన్` అనే సినిమా చేస్తున్నారు. దీంతోపాటు కమల్ హాసన్తో కలిసి ఇంకో మూవీ చేయబోతున్నారు.

