MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గోదాదేవి కళ్యాణోత్సవ వేడుకలో చిరంజీవి దంపతులు.. రెండేళ్ల తర్వాత సందడి..

గోదాదేవి కళ్యాణోత్సవ వేడుకలో చిరంజీవి దంపతులు.. రెండేళ్ల తర్వాత సందడి..

మెగాస్టార్‌ చిరంజీవి సతీసమేతంగా కృష్ణ జిల్లా డోకిపర్రులో గల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. బోగి పండుగ సందర్భంగా ఆయన శుక్రవారం సాయంత్రం డోకిపర్రులోని గోదాదేవి కళ్యాణోత్సవంలో పాల్గొని సందడి చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 15 2022, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బోగి పండుగ సందర్భంగా మార్నింగ్‌ తన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపిన చిరంజీవి, ఆ తర్వాత రవితేజ కొత్త మూవీ `రావణాసుర` ఓపెనింగ్‌లో పాల్గొన్నారు.  సాయంత్రం ఆయన  సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రుకి వెళ్లారు. అక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. ఆలయ వర్గాలు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి.
 

25

 గోదాదేవి కల్యాణం అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, కల్యాణోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం కూడా హాజరైంది. అయితే రెండేళ్ల తర్వాత చిరంజీవి ఈ ఆలయానికి రావడం విశేషం. దీంతో అక్కడికి భారీగా అభిమానులు తరలివచ్చారు.  

35

ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా చిరంజీవి హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో ఆయన గురువారం భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు చిత్ర పరిశ్రమ సమస్యలు, ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై చర్చించారు. అయితే మరో రెండు మూడు వారాల్లో అందరికి ఆమోదయోగ్యమైన ఫలితం వస్తుందని, అంతా మంచే జరుగుతుందని, సమస్యలన్నీ సెట్‌ అవుతాయని వెల్లడించారు. 

45

ఇదిలా ఉంటే చిరంజీవి.. జగన్‌ని మీట్‌ అవ్వడం వెనకాల  రాజకీయ కోణాలున్నాయనే రూమర్స్ లేచాయి. అన్ని మీడియా మాధ్యమాల్లో ఆయా వార్తలు చక్కర్లు కొట్టాయి. చిరంజీవి వైసీపీ నుంచి రాజ్యసభకి వెళ్లబోతున్నారనే టాక్‌ ఊపందుకోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన  ఘాటుగా స్పందించారు. జగన్‌తో మీటింగ్‌ వెనకాలు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తాను రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా `గివ్‌ న్యూస్‌ నాట్‌ వ్యూస్‌` అంటూ ఆయన పంచుకున్న యాష్‌ ట్యాగ్‌ పెద్ద దుమారం రేపింది. దీనికి విజయ్‌ దేవరకొండ కూడా మద్దతు పలకడం విశేషం. 

55

ప్రస్తుతం చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, `గాడ్‌ఫాదర్‌`, `భోళా శంకర్‌`, `మెగా 154` చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దీంతోపాటు వెంకీ కుడుములతో మరో సినిమా చేయబోతున్నారు చిరు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Recommended image2
Peddi Item Song : పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్.. పాట కోసం కోటి డిమాండ్ చేస్తున్న బ్యూటీ ఎవరు?
Recommended image3
Tabu Home Tour: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టబు.. రేటు తెలిస్తే కళ్తు తిరగాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved