రష్మిక చేసిన డాన్స్ సీక్వెన్స్ తొలిగించమంటూ వివాదం
రష్మిక మందన్న, విక్కీ కౌశల్ నటించిన 'చావా' సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లోని ఓ డాన్స్ సీక్వెన్స్పై విమర్శలు వస్తున్నాయి. చారిత్రక సినిమా కావడంతో కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Rashmika Mandanna
రష్మిక మంధాన లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో చావా అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఛత్రపతి శివాజీ-సాయిబాయి దంపతుల పెద్ద కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజు జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ ట్రైలర్ లో చూపించిన విక్కీ కౌశిల్, రష్మికల డాన్స్ ని ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. కొందరైతే ఆ డాన్స్ సీక్వెన్స్ తీసేయమని అడుగుతున్నారు.
ఈ చిత్రం లో చూపించిన సన్నివేశాల్లో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి విడుదలకు ముందు చరిత్రకారులకు తప్పక చూపించాలని రాజ్యసభ మాజీ ఎంపీ శంభాజీరాజే ఛత్రపతి శుక్రవారం (జనవరి 25) అన్నారు. అదే సమయంలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ , మహారాణి యేసుబాయి పాత్రలను పోషించిన నటులు విక్కీ కౌశల్ , రష్మిక మందన్న మధ్య చిత్రీకరించిన డ్యాన్స్ సీక్వెన్స్పై మరాఠాకు చెందిన కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. దాంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, మాజీ ఎంపీ ఇలా కామెంట్ చేయాల్సి వచ్చింది.
ఈ వారం మొదట్లో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లో, మహారాష్ట్ర సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉన్న సాంప్రదాయ సంగీత వాయిద్యం 'లెజిమ్'తో కౌశల్ మరియు మందన్న నృత్యం చేస్తున్న సీక్వెన్స్ ఉంది. ఆ పాటే ఇప్పుడు విమర్శల పాలవుతోంది.
Vicky kaushal movie Chhaava Trailer, Rashmika Mandanna
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం , ఆయన శౌర్యవంతమైన పాలనను ఈ చిత్రం హైలైట్ చేయడం అభినందనీయం. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మరియు అతని టీమ్ నాకు సినిమా ట్రైలర్ను చూపించారు. నేను సినిమా మొత్తం విడుదలకు ముందే చూడాలనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఏమైనా చారిత్రక సమస్యలు ఉన్నా వాటిని చరిత్ర కారులతో కూర్చుని వాటిని కనెక్ట్ చేయడానికి కూడా ముందుకొచ్చాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ ముఖ్యమైన కథను ప్రామాణికంగా అందించాలనేదే నా ఆలోచన" అని శంభాజీరాజే ఛత్రపతి అన్నారు.
రష్మిక మందన్న హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. హిందీ నిర్మాతలు రష్మిక కాల్షీట్ కోసం రేసులో ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ విక్కీ కౌశల్తో ‘చావా’ సినిమా చేసింది. ఈ మూవీలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ పోషించాడు. శంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక కనిపించనుంది.
ఈ సినిమా గురించి రష్మిక .. సౌత్ నుంచి వచ్చి మహారాణి యేసుబాయి పాత్రలో నటించాను. ఇది నా జీవితంలో నేను చేసిన ప్రత్యేక పాత్ర. ఈ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనిపించిందని దర్శకుడు లక్ష్మణ్తో చెప్పాను’ అని రష్మిక తెలిపింది. చావా ట్రైలర్ నన్ను ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ దేవుడిలా కనిపిస్తున్నాడు అని తెలిపింది రష్మిక సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నకు డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగులో పుష్ప 2 సినిమాతో భారీ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా రూ. 18 వందలకోట్లకు పైగా వసూల్ చేసి సత్తా చాటుతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ రాణిస్తుంది. తాజాగా రష్మిక రిటైర్మెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇది విని చాలా మంది షాక్ అవుతున్నారు.