సుశాంత్, దిశా సలియాన్ ఆత్మహత్యలకు గల లింకేంటి..రంగంలోకి దిగిన సీబీఐ
సుశాంత్ డెత్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాని పై సీబీఐ దృష్టి సారించింది. సుశాంత్, దిశా సలియాని ఆత్మహత్యలకు లింక్ ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ సాగనుంది.
నెలల తరబడిగా సాగుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ అనేక మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐ మరింత లోతుగా అధ్యయనం చేయనుంది. దీని కోసం సుశాంత్ కి లింక్ ఉన్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.
దీనిలో భాగంగా సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ డెత్ కేసును కూడా వీరు ఇన్వెస్టిగేట్ చేయనున్నారు. సుశాంత్ రాజ్ ఫుత్ మిత్రుడు మరియు ఫ్లాట్ మేట్ అయిన సిద్దార్ధ్ పితాని దిశా సలియాన్ మరణం గురించి తెలుసుకున్న సుశాంత్ చాలా మానసిక వేదనకు గురయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలో దిశా మరణానికి, సుశాంత్ చావుకు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో విచారణ సాగనుంది.
జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించగా, దానికి కొద్దిరోజుల ముందు జూన్ 8న దిశా సలియాని కూడా 14వ అంతస్థు నుండి దూకి మరణించడం జరిగింది. దిశా సలియాన్ డెత్ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆమె అపార్ట్మెంట్ పైనుండి దూకిన సమయంలో ఒంటిపై బట్టలు లేవని, దిశాను రేప్ అండ్ మర్డర్ చేశారని కొందరు ఆరోపించారు.
దిశా రేప్ అండ్ మర్డర్ చేయబడింది అనే వాదనను పోలీసులు కొట్టి పారేశారు. సిబిఐ మాత్రం ఈ కేసును తిరగదోడనుండని అర్థం అవుతుంది. దిశా డెత్ కేసులో మొదటగా కార్న్ స్టోన్ సీఈఓ బంటీ సందేష్ ని విచారించనున్నారు. దీనితో సుశాంత్ మరణంతో పాటు దిశా డెత్ మిస్టరీ కూడా బయటపడే అవకాశం కలదు.
ఇక సుశాంత్ డెత్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రియా చక్రవర్తి, మరియు అతని కుటుంబ సభ్యులు సీబీఐ విచారణలో పాల్గొంటున్నారు. రెండు రోజులుగా సీబీఐ ఎంక్వరీకి రియా తండ్రి హాజరవుతున్నారు.