జాన్వీ కపూర్ తో పుల్ల మామిడి ముక్కలు తినిపిస్తున్న ప్రియుడు.. వైరల్ వీడియో..
ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తెగ తిరిగేస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అయితే వీరు విహారయాత్రలకంటే.. ఆధ్యాత్మిక యాత్రలే ఎక్కువగా చేస్తుండటం విశేషం.
బాలీవుడ్ లో డిఫరెంట్ ఇమేజ్ ను సాధించింది జాన్వీకపూర్. కమర్షియల్ సినిమాలు చేయకపోయినా స్టార్ ఇమేజ్తో దూసుకుపోతోంది. అంతే కాదు..సౌత్ తో కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేసుకుంటుంది బ్యూటీ. పాన్ ఇండియా ఇమేజ్ ను సాధించాలని అనుకుంటోంది.
టాలీవుడ్ లో రెండు సినిమాలతో సౌత్ ఎంట్రీ గ్రాండ్ గా ప్లాన్ చేసింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఆర్ఆర్ఆర్ హీరోల సినిమాలతో గట్టిగానే ఎంటర్ అవ్వబోతోంది. ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర సినిమా షూటింగ్ అయిపోవస్తోంది. ఇక తాజాగా రామ్ చరణ్ సినిమా కూడా ఓపెనింగ్ జరిగింది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో జాన్వీ చరణ్ జోడీగా నటిస్తోంది.
అయితే రీసెంట్ గా ఈ భామ తన పుట్టినరోజు నాడు ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. మోకాళ్ల మీద ఆమె తిరుమల కొండ ఎక్కినట్టు ప్రకటించింది కూడా. ఇక వీరిద్దరితో పాటు బాలీవుడ్ సోషల్ మీడియా స్టార్ ఒర్రి, ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరితో మరికొంతమంది కుటుంబసభ్యులు కూడా వచ్చారు.
ఆరోజు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొన్ని నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఒర్రి తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మొత్తం వీరి ప్రయాణాన్ని అంతా ఒక బ్లాగ్ వీడియోగా రూపొందించారు. చెన్నైలో మహేశ్వరీ ఇంటిలో వీరి వీడియో బ్లాగ్ మొదలయింది. అక్కడ జాన్వీ.. అన్నం మొత్తం నెయ్యి వేసుకొని తింటున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి.
Janhvi Kapoor
ఆ తరువాత తిరుమల కొండని నడక దారిలో ఎక్కారు.మోకాళ్ల పర్వతం నుంచి మోకాళ్ల మీద జాన్వీ కొండ ఎక్కారు. ఇక దారిలో తోటి ప్రయాణికులైన ఆడియన్స్ కి జాన్వీ సెల్ఫీలు ఇస్తూనే ముందుకు సాగారు. ఇక శ్రీవారి మెట్లు ఎక్కడానికి మొత్తం అందరూ చాలా కష్టపడినట్లు కనిపిస్తుంది.
ఇక దారి మద్యలో ఉన్న స్నాక్స్ ని కూడా తింటూ ముందుకు సాగారు. ఈక్రమంలోనే జాన్వీ ఉప్పు కారం వేసిన మావిడికాయ ముక్క తింటుంటే.. ఆమె ప్రియుడు శిఖర్ పహారియా జాన్వీ నుంచి ఆ కాయని లాకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ వరుసగా తిరుమల యాత్రలు.. శిఖర్ తో కలిసి తిరగడం.. అన్ని ప్రేమించి.. అతన్నే పెళ్ళి చేసుకుంటుందంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం స్నేహంగా ఉన్నంత మాత్రాన లవ్ ట్యాగ్ తలిగిస్తారా అంటూ మండిపడుతున్నారు.