ప్రియుడితో కలిసి గుళ్ళు గోపురాలు తీరుగుతున్న జాన్వీ కపూర్..
బాలీవుడ్ లో సీక్రేట్ గా ప్రేమలు, పెళ్లిల్లు కామన్. ఇప్పటికీ యంగ్ హీరోయిన్లు చాలా మంది ప్రేమలో ఉన్నారు. కాని ఆ విషయాన్నిబయట పెట్టకుండా తిరిగేవాళ్లు ఎక్కువ. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా.. ఇదే పని చేస్తోంది. తాజాగా ఆమెకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి చెందని ఒక వ్యక్తితో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రేమలో ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. వారిద్దరూ రిలేషన్లో ఉన్నారని, అందుకు కలిసి తిరుగుతున్నారని న్యూస్ హైలెట్ అవుతూ వస్తోంది. ఇద్దరు అఫీషియల్ గా ఒప్పుకోకపోయినా... ఆ వార్తలు బలపరచడానికి కొన్ని సాక్ష్యలు కూడా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో ప్రేమలో ఉన్న జంటలు.. షికార్లు చేయడం కామన్. గోవాకో, మాల్దీవుల కోవెల్ళి ఎంజాయ్ చేస్తుంటారు. కాని వీళ్ళు మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hgsqdtpscaghjxmrx43qakj2/Janhvi-Kapoor-Mahakaleshwar-Temple-1701670480601_300x169xt.jpg)
జాన్వీ కపూర్ ఎక్కడికి వెళ్లినా.. తన బాయ్ ఫ్రెండ్ ను వెంట పెట్టుకుని వెళ్తుంది. అయితే వీరు ఎక్కువగా విహారయాత్రలకు కాకుండా.. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ షికార్ పహారియా.. జాన్వీతోనే ఎక్కువగా ఉంటున్నాడు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలుమార్లు పబ్లిక్ ప్లేసుల్లో కనిపించారు. బయట పార్టీలకు ఎక్కువగా కలిసే వెళ్తున్నారు. ఓ మారు కారులో కూడా ఇద్దరు కలిసి వెళ్తూ..కెమెరా కళ్లకు చిక్కారు.
ఇక తాజాగా ఉజ్జయినీలోని మహాకాళేశ్వరుడి గుడిని వీరిద్దరి దర్శించారు. వీరితో పాటు ఒక తమిళ దర్శకుడు కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.జాన్వీ కపూర్కు ఎప్పటినుండో దేవాలయాలకు వెళ్లడం చాలా ఇష్టం. అందుకే ఇప్పటికీ చాలాసార్లు తిరుపతికి వస్తూ వెళ్తూ ఉంటుంది ఈ భామ. ఆమధ్య తిరుపతి వెళ్ళినప్పుడు కూడా తనబాయ్ ఫ్రెండ్ ను వెంట పెట్టుకుని వెళ్ళింది బ్యూటీ.
ఇక తాజాగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ గుడికి వెళ్లింది. కానీ తను ఒంటరిగా కాకుండా తన బాయ్ఫ్రెండ్ షికార్ పహారియాను కూడా తీసుకెళ్లింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు తమిళ దర్శకుడు అట్లీ కూడా ఈ ఫోటోలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రీసెంట్ గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కలిసి జవాన్ సినిమాను తెరకెక్కించాడు అట్లీ.. ఈమూవీ బాలీవుడ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. కానీ జాన్వీ, అట్లీ కలిసి ఏ సినిమా చేయలేదు. అయినా వీరిద్దరు కలిసి గుడికి ఎందుకు వెళ్లారు అంటూ నెట్టింట్లో చర్చ మొదలయ్యింది. త్వరలో జాన్వీతో అట్లీ సినిమా చేస్తారా అన్నఅనుమానాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీగా..దేవర సినిమాలో నటిస్తోంది. అటు తమిళంలో కూడా జాన్వీ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో రీసెంట్ గా బావల్ మూవీ చేసింది జాన్వీ. సౌత్ లో వరుస సినిమాలు చేయబోతున్నట్టు సమాచారం.