- Home
- Entertainment
- తనూజతో యావర్ రొమాన్స్, శోభా శెట్టి గ్లామర్ పై ఇమ్మాన్యుయేల్ సెటైర్లు.. సోహైల్ ఇజ్జత్ తీసిన బిగ్ బాస్
తనూజతో యావర్ రొమాన్స్, శోభా శెట్టి గ్లామర్ పై ఇమ్మాన్యుయేల్ సెటైర్లు.. సోహైల్ ఇజ్జత్ తీసిన బిగ్ బాస్
బిగ్ బాస్ తెలుగు 9 షోలో 81వ రోజు శోభా శెట్టి, సోహైల్, యావర్ సందడి చేశారు. భరణి, దివ్య మధ్య గొడవలు ఈ రోజు కూడా కొనసాగాయి. ఈ ఎపిసోడ్ లో మరిన్ని హైలైట్స్ కోసం ఈ కథనం చదవండి.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు 9షోలో 81వ రోజు కూడా మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. హౌస్ మేట్స్ తో సరదాగా గడిపి వారితో టాస్క్ లలో పోటీ పడ్డారు. ముందుగా హౌస్ లోకి యావర్ వచ్చాడు. యావర్ రాగానే.. తనూజని ఫ్లర్ట్ చేశాడు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు. తనూజ లేడు అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ కనిపించాడు. యానిమల్ చిత్రంలోని ఎవరెవరో అనే సాంగ్ ప్లే అవుతుండగా తనూజకి ప్రపోజ్ చేస్తూ.. ఆమెని ఎత్తుకుని రొమాన్స్ చేస్తూ పెద్ద హంగామా చేశాడు.
రీతూకి భరణి కంప్లైంట్
ఆ తర్వాత బిగ్ బాస్ యావర్ కి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో యావర్ తనకి పోటీగా ఇమ్మాన్యుయేల్ ని ఎంచుకున్నాడు. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విజయం సాధించాడు. ఆ తర్వాత హౌస్ లో చిన్నపాటి టెన్షన్ వాతావరణం నెలకొంది. భరణి తన మెడిసిన్స్ కనిపించడం లేదు అంటూ కెప్టెన్ రీతూకి కంప్లైంట్ చేశారు. ఇంటి సభ్యులకు చెప్పి ఎక్కడ ఉన్న మెడిసిన్స్ అక్కడే పెట్టమని చెప్పాలని రీతూని కోరాడు. తాను మాట్లాడితే పరిస్థితి మరోలా ఉంటుంది అని అన్నారు.
మెడిసిన్స్ దొంగిలించిన సంజన
దీనితో రీతూ ఇంటి సభ్యులకు చెప్పింది. ఏ విషయంలో కామెడీ చేయాలో, ఏ విషయంలో కామెడీ చేయకూడదో తెలుసుకోండి అని రీతూ కోరింది. భరణి మెడిసిన్స్ దొంగిలించింది ఎవరో కాదు సంజన. పరిస్థితి సీరియస్ అవుతుండడంతో సంజన భరణి మెడిసిన్స్ తిరిగి ఇచ్చేసింది. ఈ విషయంలో భరణి, సంజన, ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతుండగా దివ్య కూడా మాట్లాడింది.
శోభా శెట్టిపై ఇమ్మాన్యుయేల్
సెటైర్లు దివ్య మధ్యలో మాట్లాడడం భరణికి నచ్చలేదు. ప్రతి దానిలో ఇలా మధ్యలో దూరవద్దు అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు. ఒక్కసారిగా భరణి, దివ్య మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత హౌస్ లోకి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. శోభా శెట్టి రాగానే ఇమ్మాన్యుయేల్ ఆమెపై జోకులు వేశాడు. థ్యాంక్యూ బిగ్ బాస్ మా కోసం మంచి యోధురాళ్ళని పంపుతున్నారు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశాడు.
కెప్టెన్సీ కంటెండర్లు వీళ్ళే
శోభా శెట్టి తనకి పోటీగా దివ్యని ఎంచుకుంది ఈ టాస్క్ లో దివ్య విజయం సాధించింది. ఆ తర్వాత హౌస్ లోకి సోహైల్ ఎనెర్జిటిక్ ఎంట్రీ ఇచ్చారు. తన తరుపున ఇంటి సభ్యుల కోసం చికెన్, పలు, కాఫీ పంపాలని బిగ్ బాస్ ని ఆర్డర్ చేశాడు. పంపండి బిగ్ బాస్ లేకుంటే వీళ్ళ ముందు నా ఇజ్జత్ పోతుంది అంటూ బతిమాలుకున్నాడు. కానీ బిగ్ బాస్ నిజంగానే సోహైల్ ఇజ్జత్ తీశాడు. చికెన్ ఫోటో ఉన్న పేపర్, కాఫీ ఫోటో ఉన్న పేపర్, మిల్క్ ఫోటో ఉన్న పేపర్ పంపాడు. కానీ ఆ తర్వాత సోహైల్ కోరిక మేరకు నిజంగానే చికెన్, మిల్క్, కాఫీ పంపారు. సోహైల్ తో టాస్క్ లో సంజన, రీతూ ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ టాస్క్ లో సంజన, రీతూ ఇద్దరూ విజయం సాధించారు. హౌస్ లో చివరి కెప్టెన్ కావడానికి జరిగే పోటీ కోసం కంటెండర్లుగా కళ్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, దివ్య, సంజన, రీతూ అర్హత సాధించారు. దీనితో బిగ్ బాస్ వారిని అభినందించారు.

