Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్ లో మణింకఠకు అన్యాయం, టార్గెట్ చేసి కార్నర్ చేస్తున్న అందరు..

బిగ్ బాస్ హౌస్ లో మణింకఠకు అన్యాయం, టార్గెట్ చేసి కార్నర్ చేస్తున్న అందరు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇస్తున్న కిక్కు అంతా ఇంతా కాదు.. రోజు రోజుకు డోస్ పెంచుతూ..అదిరిపోయే స్టఫ్ అందిస్తున్నాడు బిగ్ బాస్. తాజా ఎపిసోడ్ లో కూడా ఆడియన్స్ కు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ను అందించాడు. 

Mahesh Jujjuri | Published : Oct 05 2024, 12:10 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. హౌస్ లో రోజుకో  సినిమా చూపిస్తున్నారు. ప్రస్తుతం అందరి టార్గెట్ ఒక్కటే.. అందరు భయపడేది ఒక్కరికే అతనే సింపతీ స్థార్ మణికంఠ. ఎలాగైనా మణికంఠనుఇంటి నుంచి పంపించాలని పట్టుదలతో ఉన్నారు అందరు. అయితే బిగ్ బాస్ మణికంఠకు ఓటింగ్ బాగుంది అని తెలిసిన తరువాత అందరికి జ్ఞానోదయం అయ్యింది. సింపతీతో మణి ఓట్లు సాధిస్తున్నాడని.

అప్పుడు కూడా జాత్రత్త పడకుండా.. అతన్ని మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు. నువ్వు ఆడియన్స్ ముందు మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావంటూ.. సీత డైరెక్ట్ గా అనేసింది. అందరు మణిని కార్నర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు దీని వల్ల ఓటింట్ పెరడంతో పాటు అతను టాప్ 5లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

26
Asianet Image

ఇక  బిగ్ బాస్ హైస్ లో అందరు ఒక వైపు.. మణింకఠ ఒక వైపు అన్నట్టుగా వ్యవహారం మారిపోయింది. అతను కలిసినా కూడా కలుపుకున్నట్టే ఉంటూ... మణికంఠ పక్కకు వెళ్ళిన తరువాత.. అనాల్సినవన్నీ అనేస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్య సీత మణికంటను ఎక్కువగా టార్గెట్ చేస్తుుంది.

ముందు నుంచి నిఖిల్, పృధ్వీ, యష్మి, నైనిక వీళ్ళంతా మణిపై ఛాన్స్ దొరికితే.. విమర్శించే విధంగా ఉన్నారు. కాని ఇప్పుడు సీత, విష్ణు ప్రియ, ప్రేరణ కూడా ఈ బ్యాచ్ లో చేరారు. ఇక నబిల్ మాత్రం గోడమీద పిల్లిలా ఎటు వీలుంటే అటు వెళ్తున్నాడు. 

36
Asianet Image

ఇక తాజా ఎపిసోడ్ లో మాత్రం అందరు నవ్వుతూనే అతనిపై అక్కసు వెళ్ళగగ్గారు. మార్నింగ్ మస్తిలో భాగంగా.. మణింకఠ జోతీష్కుడు అవతారంలో కనిపించాడు. అందరి జాతకం చెప్పించుకున్నారు. ఈక్రమంలో మణింకంఠను గుంటనక్క అని సీత కామెంట్ చేసింది. ఇక పృథ్వీ ‌- విష్ణు ప్రియ వ్యవహారం ఈరోజు డైరెక్ట్ అయిపోయింది.

ఒకతనిపై మనసుపడ్డాను అంటూ ఆమె చెప్పాడం.. అటు పృధ్వీ జాతకం చెప్పించుకునేప్పుడు కూడా..  హింట్ ఇవ్వడం జరిగింది. ఇక పృధ్వీ జాతకం చెపుతు.. కక్క్రుత్తి పనికిరాదు అని చెప్పాడు. ఇక పృధ్వీ విషయంలో యష్మి కూడా కాస్త ఎక్కువగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అర్ధం అవుతోంది. 
 

46
Asianet Image

ఇక ఇంట్లో వారికోసం వారి ప్యామిలీస్ నుంచి ఫుడ్ తో పాటు.. మెసేజ్ కూడా తీసుకువచ్చాడు బిగ్ బాస్. కాని ఒక్కొక్కరిని లోపలికి పిలిచి.. వారికి  ఇద్దరు ఆప్షన్ ఇచ్చి.. ఎవరి ఫుడ్ తీసుకెళ్తారు చెప్పండి అని ట్విస్ట్ పెట్టాడు. అయితే ఎవరు హౌస్ లో ఇష్టమైన వాళ్ళు.. ఎవరు అంటే ఇష్టం లేదు అని కూడా అడిగాడు బిగ్ బాస్. ఇక ఎక్కువ మంది మణికంఠ అంటే ఇష్టం లేదని.. కాని ఇప్పుడు ఇష్టం ఉంది అని సేఫ్ సమాధానం చెప్పారు. 

56
Asianet Image

ఎక్కడో విదేశాల్లో ఉన్న తన భార్య పంపించిన మెసేజ్, ఫుడ్ మణికంఠకు అందకుండా... నిఖిల్ కు సబంధించిన ఫుడ్ ను తీసుకువచ్చింది యష్మి. దాంతో మణికంఠ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆతరువాత తనకు వచ్చిన ఛాన్స్ ను ఉపయోగించుకుని.. యష్మికి వచ్చిన ఫుడ్ కాకుండా.. ఫృధ్వీ కోసం ఫుడ్ ను తీసుకువచ్చాడు మణి.

ఇక ఈక్రమంలో .. ఎవరికి అయితే ఫుడ్ రాలేదో వారి బాక్స్ లు హౌస్ బయట పెట్టి.. ఫుడ్ వచ్చినవారికి ఫుడ్ రానివారికోసం ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్. కాని అప్పుడు కూడా కనీసం మణికంఠను పరిగణలోకి తీసుకోకుండా.. విష్ణు ప్రియ ఫుడ్ ను సెలక్ట్ చేసుకున్నారు.

దాంతో క్లియర్ గా అర్ధం అవుతుంది. మణికంఠను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని. ఈక్రమంలో అతనికి ఓటింట్ పెంచడంతో పాటు.. ఈ వీక్ అతనిపై చేసిన కామెంట్స్ వలన అతన్నీ టైటిల్ రేస్ లో నిలబడేలా చేస్తున్నారు. ఇక టాప్ 5 లో మణికంఠ ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. 

66
Asianet Image

సో తాజా ఎపిసోడ్ లో అందరుఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఏడుపులతో.. ఎమోషనల్ కామెంట్స్ తో.. బిగ్ బస్ హౌస్ వాతవారణం మారిపోయింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పాటు.. బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం వీకెండ్ వచ్చేసింది. రేపు నాగార్జున వచ్చి ఎవరిని సేవ్ చేస్తాడు.. ఇంటి నుంచి ఇప్పటికే ఆదిత్య బయటకు వెళ్ళిపోయారు. మరి వీకెండ్ లో ఎవరు ఎిలిమినేట్ అవ్వబోతున్నారుఅనేది క్లారిటీ ఇవ్వబోతున్నాడు. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories