Bigg boss telugu:ఓడిపోయి బయటకొచ్చానని అన్నీ మూసుకు కూర్చున్నా... కొందరు డబ్బులు ఇచ్చి...
గత వారం ఎలిమినేటైన యాంకర్ రవి షో (Bigg boss telugu 5) గురించి, తనతో ట్రావెల్ చేసిన కంటెస్టెంట్స్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. హౌస్ లో జరిగేది ఒకటి చూపించేసి ఒకటని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు హౌస్ లో ఉన్న కొందరి గురించి చెబితే మీరు షాక్ అవుతారన్నారు.
12వ వారం హౌస్ నుండి యాంకర్ రవి (Anchor ravi) ఎలిమినేట్ కాగా... ప్రేక్షకులలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆయన ఫ్యాన్స్ చివరికి నిరసనలకు కూడా దిగారు. రవి ఎలిమినేషన్ వాస్తవికత లేదని, నిర్వాహకులు ఓట్లతో సంబంధం లేకుండా రవిని కావాలనే ఎలిమినేట్ చేశారని ఆరోపిస్తున్నారు. వీరి వాదనలో నిజం ఉందనిపిస్తుంది. కారణం సిరి, ప్రియాంక, కాజల్ కంటే కూడా రవికి తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మడం కష్టమే.
కాగా తన ఎలిమినేషన్ తో పాటు సోషల్ మీడియా ట్రోల్స్, బిగ్ బాస్ హౌస్ గురించి రవి వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రవి మాట్లాడుతూ... షోలో జరిగేది వేరు, బయట చూపించేది వేరు. నేను ఇప్పుడు కొన్ని నిజాలు బయట పెడితే, అవునా అని మీరు షాక్ అవుతారు. అయితే నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను ఎవరిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయను. నేను ఓడిపోయి బయటికి వచ్చాను కాబట్టి అన్నీ మూసుకొని కూర్చున్నా.
కానీ హౌస్ లో కొందరు గురించి చెప్పాలి. అయితే ఇప్పుడు నేను ఎవరి గురించీ మాట్లాడను. నా మాటలతో వాళ్ళ గేమ్ ని దెబ్బతీయడం, వెనక్కి లాగడం నేను చేయను. ఎందుకంటే నేను అలాంటి వ్యక్తిని కాదు. షోకి వెళ్లబోయే ముందు నేను స్వయంగా చెప్పాను. నన్ను ట్రోల్ చేసుకోండని. కానీ నా భార్య నిత్యాను ఇన్వాల్వ్ చేశారు. చివరికి నా బిడ్డపై కూడా దారుణమైన కామెంట్స్ చేశారు. వీరందరూ డబ్బులు తీసుకుని లోపల వాళ్ళ కోసం పని చేస్తున్నారు.
వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చెప్పను. ఇలా డబ్బులు తీసుకొని ట్రోల్స్ చేసేవాళ్ళు, చివరికి అదే డబ్బుల కోసం తల్లిదండ్రుల మీద కూడా ట్రోల్స్ వేస్తారు. లోపల ఒక గేమ్ నడుస్తుంటే బయట మరో గేమ్ నడుస్తుంది. లోపలి గేమ్ వీరి వలన ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటివి దయచేసి చేయకండి... నాకు కుటుంబానికి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు.. అంటూ రవి తన ఆవేదన తెలియజేశారు.
రవి పరోక్షంగా తన ఎలిమినేషన్ అన్యాయం అన్నట్లు మాట్లాడారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఆయన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడంతో పాటు కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేశారని తెలిపారు. ఇదంతా డబ్బులు తీసుకొని హౌస్ లో ఉన్న కొందరు కంటెస్టెంట్స్ కోసం చేస్తున్నట్లు వివరించారు. మరి రవి ఆరోపణలు చేసిన ఆ కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాల్సి ఉంది.
కాగా మరో మూడు వారాల్లో షో ముగియనుంది. రవి ఎలిమినేషన్ తర్వాత సిరి, ప్రియాంక, మానస్, కాజల్, షణ్ముఖ్, శ్రీరామ్ లతో పాటు సన్నీ హౌస్ లో ఉన్నారు. ఈ వారం నామినేటైన వారిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఫైనల్ కి కేవలం ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే వెళతారు. ఇక టైటిల్ రేసులో సన్నీ, షణ్ముఖ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
Also read Bigg Boss Telugu 5: రెండు సెకండ్ల తేడాతో షణ్ముఖ్ ని బీట్ చేసిన సన్నీ.. కాజల్ రెచ్చిపోతోందిగా
Also read Jabardasth: ఆ రెండు రోజులు ఎక్కడ ఉన్నారు... పర్సనల్ ఫొటోస్ లీక్ కావడంతో షాకైన వర్ష, ఇమ్మానియేల్!