షాకింగ్ న్యూస్ః సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న అనుష్క.. పెళ్లికి ప్లాన్ ?.. కారణం అదేనా?
అనుష్క శెట్టి అభిమానులకు షాక్ ఇవ్వబోతుందట. త్వరలో ఆమె సినిమాలకు గుడ్బై చెప్పబోతుందట. అంతేకాదు ఇక యాక్టింగ్ మానేసి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనే ప్లాన్లో ఉందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్లో వైరల్ అవుతుంది.
అనుష్క శెట్టి కోట్లాది తెలుగు ఆడియెన్స్ డ్రీమ్ గర్ల్. ఈ యోగా టీచర్ అందానికే కాదు, అద్భుతమైన నటనకి కోట్లాది మంది అభిమానులున్నారు.
యోగా టీచర్గా రాణించే ఈ అమ్మడిని చూసి ఫిదా అయిన పూరీ, నాగార్జున `సూపర్` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేశారు. అంతే ఎంట్రీతోనే ఇటు ఆడియెన్స్ ని అటు సినీ వర్గాలను మాయ చేసింది.
`మహానంది` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్వీటిని చూసిన రాజమౌళి `విక్రమార్కుడు`తో స్టార్ హీరోయిన్ ని చేశాడు. రవితేజ సరసన నటించిన అనుష్క అందాలతో కనువిందు చేసింది.
ఈ సినిమా బ్లాక్బస్టర్తో అనుష్క ఇక టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో కేవలం నాలుగేళ్లలో 20 సినిమాల్లో నటించిందంటే ఆమె ఏ రేంజ్లో టాలీవుడ్ని ఊపేసిందో అర్థం చేసుకోవచ్చు.
2006 నుంచి 2010 వరకు టాలీవుడ్ `అనుష్క నామస్మరణం` చేసిందనే చెప్పాలి. బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో ఒకటికి రెండు రౌండ్లు కొట్టేసింది.
`విక్రమార్కుడు`, `లక్ష్యం`, `డాన్`, `ఒక్కమగాడు`, `స్వాగతం`, `బలాదుర్`, `శౌర్యం`, `చింతకాయల రవి`, `కింగ్`, `అరుంధతి`, `బిల్లా`, `కేడీ`, `వేదం`, `పంచాక్షరి`, `ఖలేజా`, `నాగవళ్లి`, `రగడ`, `ఢమరుకం`, `మిర్చి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `సైజ్ జీరో`, `భాగమతి` చిత్రాలతో మెరిసింది.
`అరుంధతి`, `వేదం`, `పంచాక్షరి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` చిత్రాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది. స్టార్ హీరోల స్థాయి ఇమేజ్ని సొంతం చేసుకుని ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తుంది.
అయితే గతేడాది `నిశ్శబ్దం` చిత్రంలో మెరిసింది అనుష్క. ఈ సినిమా పరాజయం చెందింది. కానీ ఇప్పటి వరకు మరో సినిమాని ప్రకటించలేదు.
యూవీ క్రియేషన్స్ లో నవీన్ పొలిశెట్టితో సినిమా చేయబోతుందని, త్వరలోనే సినిమా ప్రారంభం కాబోతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు.
తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆగిపోయిందంటున్నారు. అందుకు కారణంగా కథలో మార్పులు చేయడానికి దర్శకుడు ఆసక్తి చూపడం లేదని, ఒకవేళ చేస్తే కథ షేపౌట్ అయిపోతుందని పక్కన పెట్టారట.
ఇదే కాదు అసలు కారణం మరోటి ఉందని టాక్. అనుష్క బరువ తగ్గలేకపోతుంది. `సైజ్జీరో` సినిమా కోసం బాగా లావెక్కింది అనుష్క. ఆ సినిమా డిజాస్టర్ కావడమే కాదు, అనుష్కని ఆరోగ్య సమస్యల్లో పడేసింది.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకోసం, ఆయన కుమారుడు ప్రకాష్ కోవెలమూడి చేసిన `సైజ్జీరో` అనుష్కకి దారుణమైన ఫలితాన్నిచ్చింది. ఆ సినిమా కోసం బాగా బరువెక్కిన అనుష్క తిరిగి యదాతథ స్థితి రాలేకపోతుంది.
బరువు తగ్గే క్రమంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. అందుకే సినిమాలు చేయలేకపోతుందనే వార్తలు సోషల్ మీడియాలో, అటు ఫిల్మ్ నగర్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.
దీని కారణంగానే ఈ నాలుగేళ్లలో అనుష్క కేవలం రెండు సినిమాలే చేసింది. బరువు తగ్గలేకపోవడమే అందుకు కారణాలుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చిందట అనుష్క.
సినిమాలు మానేయాలనే ఆలోచనకు వచ్చిందట. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలోనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇదే నిజమైతే కోట్లాది అనుష్క అభిమానుల గుండెలు బద్దలవడం ఖాయం. ఓ రకంగా ఇది టాలీవుడ్కి కూడా పెద్ద షాకింగ్ విషయంగానే చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంతా? అనేది చూడాలి. కానీ ఈ వార్తలు మాత్రం హాట్ టాపిక్గా మారాయి.