బాలయ్య భామ కత్రినా కైఫ్ ఆస్తుల చిట్టా మామూలుగా లేదుగా.. చిన్ననాటి రేర్ పిక్స్ వైరల్ !
బాలయ్య, వెంకీల హీరోయిన్ కత్రినా కైఫ్ నేడు(జులై 16)న తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కత్రినా చిన్ననాటి ఫోటోలు, ఆస్తులు వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కత్రినా కైఫ్.. ఛాక్లెట్ భామగా బాలీవుడ్ని ఓ ఊపుఊపుతోంది. యంగ్ హీరోయిన్ల నుంచి స్టార్ హీరోల వరకు అందరికి కత్రినా బెస్ట్ ఆప్షన్. కమర్షియల్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కేట్.
నేడు శుక్రవారం(జులై 16) తన 38వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రెండు చిన్ననాటి అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హాంకాంగ్(బ్రిటీష్)లో జన్మించిన ఈ క్యూట్ అందాల భామ మోడల్గానే కెరీర్ని ప్రారంభించింది. బ్రిటీష్ మోడల్గా ఉన్నప్పుడు కైజాద్ గుస్తాద్ ఓ ఫ్యాషన్ షోలో కత్రినాని చూసి సినిమాల్లోకి తీసుకొచ్చారు.
`బూమ్` అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశారు. అమితాబ్ బచ్చన్ హీరోగా రూపొందిన చిత్రమిది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ వెంటనే తెలుగు మేకర్స్ ఫోకస్ పడింది.
దర్శకుడు విజయ్ భాస్కర్ వెంకీతో రూపొందించిన `మల్లీశ్వరి` చిత్రం కోసం తెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగులో తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. వెండితెరపై మ్యాజిక్ చేసిందీ కత్రినా.
హిందీలో భారీ ఆఫర్స్ క్యూ కట్టాయి. `సర్కార్` `మైనే ప్యార్ క్యూన్ కియా?` చిత్రాల్లో హీరోయిన్గా ఎంపికైంది. ఈ రెండు చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి.
అదే సమయంలో బాలకృష్ణ నటించిన `అల్లరి పిడుగు` చిత్రానికి ఎంపిక చేశారు. ఇందులో బాలయ్యతో ఆడిపాడి అలరించింది. సినిమా పరాజయం సాధించడం, హిందీలో వరుసగా భారీ ఆఫర్స్ రావడంతో టాలీవుడ్కి గుడ్బై చెప్పేసింది. పూర్తిగా హిందీ చిత్రాలకే పరిమితమయ్యింది.
అయితే అక్కడ తనదైన గ్లామర్, నటనతో మ్యాజిక్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ని షేక్ చేస్తూ వచ్చింది కత్రినా. కనువిందు చేసే అందం, అబ్బురపరిచే నటన, మతిపోగొట్టే డాన్సులు ఆడియెన్స్ ని ఫిదా చేశాయి. దీంతో తక్కువ టైమ్లోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
దాదాపు అందరు స్టార్లతో ఆడిపాడిన ఈ భామ ఛాన్స్ వస్తే ఐటెమ్ సాంగ్లతోనూ మెస్మరైజ్ చేసింది. `చిక్నీ చమేలీ`, `షీలాకీ జవానీ` పాటలతో బాలీవుడ్ని ఓ ఊపు ఊపింది.
ఈ పాటలు ఎంతగా పాపులర్ అయ్యాయంటే కొన్నేళ్లపాటు యావత్ ఇండియన్ సినీ ప్రియులచేత స్టెప్పులేయించింది. ఇప్పటికీ ఈ పాటలకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే ఇందులో కత్రినా చేసిన డాన్సుల మ్యాజికే అని చెప్పొచ్చు.
దాదాపు 18ఏళ్ల కెరీర్లో 40 సినిమాలకుపైగా నటించింది కత్రినా. అంతేకాదు ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా తన ప్లేస్ మాత్రం పదిలం అనేంతగా ఎస్టాబ్లిష్ చేసుకుంది.
ఈ అమ్మడి డిమాండ్ ఏ రేంజ్లో అంటే యంగ్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు రూ.10కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. దీంతో బాలీవుడ్ హీరోయిన్లలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది కేట్.
అంతేకాదు ఈ రెండు దశాబ్దాల కాలంలో ఆస్తులు కూడా బాగానే వెనకేసుకుందట. ప్రస్తుతం ఈ అమ్మడి అస్తులన్నీ కలిపితే రూ.150కోట్లు ఉంటాయని బాలీవుడ్ మీడియా వర్గాల టాక్.
ఈ మ్మడికి ముంబయిలో దాదాపు 8-10కోట్ల విలువ చేసే విలాసవంతమైన హౌజ్ ఉందట. అలాగే లండన్లోనూ ఏడు కోట్ల విలువ చేసే బంగ్లా ఉందని సమాచారం.
దీంతోపాటు ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వోగ్ ఎల్ డబ్ల్యూబీ, మెర్సిడేస్ ఎంఎల్ 350, ఆడి క్యూ 7 కార్లు ఉన్నాయట. వీటి విలువ పదికోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
అలాగే `కే బ్యూటీ` అనే మేకప్ బ్రాండ్ ని స్థాపించింది కత్రినా. దీన్నుంచి భారీగానే ఆదాయాన్ని పొందుతుంది. అలాగే ఫిట్నెస్ బ్రాండ్ `రీబూక్` కి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తుంది.
పలు వాణిజ్య ప్రకటనలకు, బ్రాండ్లకి అంబాసిడర్గా చేస్తూ ఆదాయాన్ని అర్జిస్తుంది. ఇవే కాక ల్యాండ్ మీద కూడా భారీగానే ఇన్వెస్ట్ చేసిందట కత్రినా. ఈ రకంగా తాను సంపాదించిన డబ్బుని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటుందట.
ఇదిలా ఉంటే బాలీవుడ్లో రాణించే క్రమంలో కత్రినా ప్రేమ వ్యవహారాలు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. సల్మాన్ ఖాన్తో కొన్నాళ్లు, రణ్బీర్ కపూర్తో మరికొన్నాళ్లు డేటింగ్ చేసింది కత్రినా. ప్రస్తుతం సింగిల్గానే ఉందని టాక్.
ప్రస్తుతం కత్రినా `సూర్యవంశీ` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `టైగర్3`లో సల్మాన్తో నటిస్తుంది. అలాగే `ఫోన్ బూత్`అనే మరో సినిమా చేస్తుంది.