సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న బాలకృష్ణ `అఖండ` టైటిల్ రోర్.. రిలీజ్ వాయిదా?
బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్ర టీజర్ సంచలనాలు సృష్టిస్తుంది. ఫస్ట్ రోర్ పేరుతో విడుదలైన ఈ వీడియో రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుంది. తాజాగా ఇది అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ని సాధించిన టీజర్గా నిలిచింది.
కేవలం 16 రోజుల్లోనే 50 మిలియన్స్ వ్యూస్ని సాధించిందని తెలిపింది `అఖండ` యూనిట్. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం చెబుతూ, ``కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది..కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఇదే డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగ్ అంత పాపులర్ అవడమే కాకుండా సింహా', 'లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్బస్టర్ కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని మరింత పెంచింది.
ఉగాది సందర్భంగా ఏప్రిల్13న మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో `అఖండ` టీజర్ విడుదలై యూట్యూబ్లో అపూర్వ ఆదరణతో దూసుకెళ్తూ కేవలం 16రోజుల్లోనే 50మిలియన్లకు పైగా వ్యూస్ని సాధించి టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 50మిలియన్స్ వ్యూస్ సాధించిన టీజర్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ ఇంతటి అఖండ విజయానికి కారణమైన అభిమానులకు, ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని తెలిపింది.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ``సింహా`, `లెజెండ్` తర్వాత బాలయ్యతో చేస్తున్న`అఖండ` సినిమాపై ప్రేక్షకులకు, అభిమానులకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. బాలయ్య నటవిశ్వరూపాన్నిఈ సినిమాలో మరోసారి చూస్తారు. `అఖండ` టైటిల్ రోర్ని ఇంత అఖండంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి, అభిమానులకి హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను` అని అన్నారు.
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, `మా మూవీ `ఫస్ట్ రోర్` విడుదలైన దగ్గర నుండి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు `అఖండ` టైటిల్ రోర్తో ప్రేక్షకులలో, అభిమానుల్లో ఆ అంచనాలు రెట్టంపయ్యాయి. అందరి ఎక్స్పెక్టేషన్స్ని అందుకునేలా బోయపాటిగారు ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. `అఖండ` టైటిల్ రోర్ మరిన్ని రికార్డ్స్ సృష్టిస్తుందని ఆశిస్తున్నాను.
మా ద్వారక క్రియేషన్స్ బేనర్లో `అఖండ` తప్పకుండా ఒక ప్రస్టేజియస్ మూవీగా నిలుస్తుంది. బాలయ్యబాబు, బోయపాటి గార్ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న `అఖండ` నందమూరి అభిమానుల్లో పండగ తీసుకొస్తుంది. ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత త్వరలోనే థియేటర్స్లో కలుద్దాం` అన్నారు. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడబోతుందని హింట్ ఇచ్చేసింది యూనిట్. మే 28న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడిది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది.