Balayya Sankranti Celabration: గుర్రమెక్కిన బాలయ్య, మోక్షజ్ఞ.. కారంచేడులో తండ్రీకొడుకుల హంగామా.. ఫోటోలు వైరల్
`అఖండ`తో సక్సెస్ అందుకున్న బాలకృష్ణ అదే జోరుమీదున్నాడు. సంక్రాంతి సంబరాలు అత్యంత గ్రాండ్గా చేసుకుంటున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి కారంచేడు సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. బాలయ్య, మోక్షజ్ఞ గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించడం హైలెట్గా నిలిచింది.
ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉండే బాలకృష్ణ.. అన్ని వదిలేసి సంకాంతి పండగని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారంచేడుని వేదికగా చేసుకున్నారు. బాలయ్య ఫ్యామిలీ మొత్తం కారంచేడుకి వెళ్లింది. అక్కడ అక్క దగ్గుబాటి పురంధరేశ్వరి ఇంట్లో ఈ సారి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు.
అక్క ఇంటి వద్ద నందమూరి ఫ్యామిలీ చిల్ అవుతుందని చెప్పొచ్చు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ ఫ్యామిలీ కూడా కారంచేడు చేరుకున్నారు .ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈసారి బాలయ్య (Nandamuri Balakrishna) కుటుంబంతో సహా సంక్రాంతి సంబరాల కోసం కారంచేడు చేరుకోవడంతో.. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నందమూరి కుటుబం రాకతో అక్కడ హడావిడి పెరిగిపోయింది గ్రామం నుంచి ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు.
బాలయ్య ఫ్యామిలీ కారంచేడులో సందడి చేస్తున్న నేపథ్యంలో అక్కడ పండగ మరింత రెట్టింపయ్యిందని చెప్పొచ్చు. అభిమానులు కూడా వారిని చూసేందుకు తరలి రావడంతో అక్కడ అంతా పండగ వాతావరణం, కోలాహలం నెలకొంది.
ఇదిలా ఉంటే అక్క ఇంటి వద్ద గుర్రం స్వారీ చేశారు బాలయ్య. సంక్రాంతి పండగంటే గంగిరెద్దుల వాళ్లు ఇంటింటికి తిరుగుతూ సందడి చేస్తుంటారు. అయితే బాలయ్య ఇంటికి గుర్రంతో రావడం విశేషం. దీంతో బాలయ్య గుర్రం ఎక్కాడు. దానిపై స్వారీ చేశాడు.
మరోవైపు తనయుడు మోక్షజ్ఞ కూడా గుర్రం ఎక్కి స్వారీ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాలయ్య అభిమానులు వాటిని పంచుకుంటూ వైరల చేస్తున్నారు.
నందమూరి నటసింహ బాలకృష్ణ `అఖండ` చిత్రంతో మోగించి మోత అంతా ఇంతా కాదు. ఒక్క దెబ్బకి ఇండస్ట్రీ మొత్తానికి ఊపు తీసుకొచ్చాడు. థియేటర్లని ఫుల్ చేసి ఇండస్ట్రీకి కొత్త కళని తీసుకొచ్చారు బాలయ్య.
బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సంచలన విజయం సాధించింది. ఏకంగా 130కోట్లు వసూలు చేసింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఇది థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండటం విశేషం.
ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `ఎన్బీకే 107` చిత్రం చేస్తున్నారు. ఇది త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో శృతి హాసన్ కథానాయికగా, వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
మోక్షజ్ఞ కూడా గుర్రం ఎక్కి స్వారీ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తెగ వైరల్