- Home
- Entertainment
- 'ఏజెంట్' నుంచి మమ్మల్ని దేవుడే కాపాడాడు.. అఖిల్ సినిమాపై బడా నిర్మాత సంచలన వ్యాఖ్యలు
'ఏజెంట్' నుంచి మమ్మల్ని దేవుడే కాపాడాడు.. అఖిల్ సినిమాపై బడా నిర్మాత సంచలన వ్యాఖ్యలు
అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి దారుణ పరాజయం ఎదుర్కొందో తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి దారుణ పరాజయం ఎదుర్కొందో తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏజెంట్ మూవీని దాదాపు 80 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. కానీ పది శాతం పెట్టుబడిని కూడా ఈ చిత్రం రికవరీ చేయలేకపోయింది. ఫలితంగా నిర్మాతతో పాటు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్లు కూడా దారుణంగా దెబ్బతిన్నారు.
అఖిల్ కి అయితే ఈ చిత్రం కెరీర్ లోనే బిగ్ డిజప్పాయింట్మెంట్. దాదాపు రెండేళ్ల పాటు అఖిల్ ఈ చిత్రం కోసం సురేందర్ రెడ్డి చెప్పిందల్లా చేస్తూ ఒళ్ళు హూనం చేసుకున్నాడు. సిక్స్ ప్యాక్ కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ అఖిల్ కష్టానికి కాస్త కూడా ఫలితం దక్కలేదు. దీనితో అఖిల్ తో పాటు ఫ్యాన్స్ కి కూడా నిరాశే మిగిలింది.
ఏజెంట్ మూవీ మిగిల్చిన నష్టాలని నిర్మాత అనిల్ సుంకర ఇంకా భరిస్తూనే ఉన్నారు.బయ్యర్లు గోల చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ తరుణంలో ఓ బడా నిర్మాత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఏసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీపై కామెంట్స్ చేశారు. ఏజెంట్ మూవీ నుంచి తమని దేవుడే కాపాడాడు అంటూ సునీల్ నారంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' ఏజెంట్ సినిమా హక్కులు కొందామని నిర్మాత అనిల్ సుంకరని సంప్రదించాం. కానీ నిర్మాత చాలా పెద్ద ధర డిమాండ్ చేశారు. తాము ఆలోచించుకుని ఈ రేటు వర్కౌట్ కాదులే అని నిర్ణయించుకున్నాం. అంత రేటుకి మేము కొనడం లేదు.. వేరేవాళ్లకు ఇచ్చేయండి అని చెప్పేశాం. ఏజెంట్ మూవీ విషయంలో మమ్మల్ని దేవుడే కాపాడాడు అని భావించాలి' అంటూ సునీల్ నారంగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు నిర్మాత నట్టి కుమార్ కూడా ఏజెంట్ మూవీ పై హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అఖిల్ ఏజెంట్ చిత్రాన్ని చంపేసింది నిర్మాత దిల్ రాజు అని ఆరోపించారు. అఖిల్ చిత్రానికి థియేటర్స్ ఇవ్వకుండా తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2కి భారీగా థియేటర్స్ బ్లాక్ చేశారు అని.. అందువల్లే ఏజెంట్ కి సరైన ఓపెనింగ్స్ రాలేదు. ఫలితంగా భారీగా నష్టాలు చవిచూసింది అని నట్టికుమార్ ఆరోపణలు చేశారు.
అక్కినేని ఫ్యామిలీపై జరుగుతున్న కుట్రలపై నాగార్జున గారు మేల్కోవాలని, తనయుల కెరీర్ ని చక్కబెట్టాలని కూడా ఆయన అన్నారు. ఏది ఏమైనా ఏజెంట్ చిత్రం అందరికీ చేదు జ్ఞాపకాలని మిగిల్చింది అని చెప్పాలి.