MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరు సినిమా ఫ్లాప్, త్రివిక్రమ్ ని తిట్టిన అశ్విని దత్.. టాలీవుడ్ లో అలాంటి వాళ్ళు వారిద్దరే

చిరు సినిమా ఫ్లాప్, త్రివిక్రమ్ ని తిట్టిన అశ్విని దత్.. టాలీవుడ్ లో అలాంటి వాళ్ళు వారిద్దరే

మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం జానపద చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

2 Min read
tirumala AN
Published : May 12 2024, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం జానపద చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చూడాలని ఉంది చిత్రం కూడా సూపెర్ హిట్ గా నిలిచింది. ఏఈ రెండు చిత్రాలు నెమ్మదిగా మొదలై ఒక సంచలనం సృష్టించాయని అశ్విని దత్ అన్నారు. 

26
Asianet Image

కానీ ఇంద్ర చిత్రం విషయంలో రెండో మాటేలేదు. ఫస్ట్ షో నుంచే ప్రభంజనం మొదలైంది. ఇంద్ర చిత్రం టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది అని అశ్విని దత్ అన్నారు. ఇంద్ర ఫస్ట్ షో పూర్తయ్యాక విజయవాడ పోలీస్ కమిషనర్ చిరంజీవికి ఫోన్ చేశారు. 

36
Trivikram

Trivikram

సార్ మీరు ఊహించిన దానికంటే సినిమా అదిరిపోతుంది. మీ ఫ్యాన్స్ ఓపికగా ఉండాలని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి లేకుంటే థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం మా వల్ల కాదు అని చెప్పినట్లు అశ్వినీదత్ రివీల్ చేశారు. అయితే ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన జై చిరంజీవ చిత్రం మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

46
Asianet Image

నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు లాంటి ఫన్ చిత్రాలు తెరకెక్కించిన విజయ భాస్కర్ దర్శకత్వంలో జై చిరంజీవ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో డైరెక్టర్ విజయ భాస్కర్ తప్పేమి లేదు. ఆయన చాలా అద్భుతమైన డైరెక్టర్. ఇచ్చిన స్క్రిప్ట్ ని ఇచ్చినట్లు అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్లు టాలీవుడ్ లో ఇద్దరే ఉన్నారు. 

56
Asianet Image

 

ఒక విజయ భాస్కర్ కాగా మరొకరు యస్వీ కృష్ణారెడ్డి. స్క్రిప్ట్ ఎలా ఉంటే అలాగే వీళ్ళిద్దరూ సినిమా తీస్తారు. జై చిరంజీవ విషయంలో విజయ భాస్కర్ ఎలాంటి తప్పు చేయలేదు. ఆ స్క్రిప్ట్ ఇచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ ఆ సమయంలో మహేష్ బాబు అతడు చిత్రంతో బిజీగా ఉన్నాడు. 

 

66
Asianet Image

 

దీనితో స్క్రిప్ట్ పై సరిగ్గా వర్క్ చేయలేదు. కొన్ని మార్పులు ఉంటే అవి కూడా లేకుండా స్క్రిప్ట్ ఇచ్చేశాడు. త్రివిక్రమ్ చేసిన తప్పు వల్లే జై చిరంజీవ ఫ్లాప్ అయింది. నేనేమి త్రివిక్రమ్ ని నిందించడం లేదు. కానీ జరిగింది అదే అని అశ్విని దత్ అన్నారు. 

 

About the Author

tirumala AN
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved