అనుష్క శర్మ `3ఇడియట్స్ ` ఆడిషన్ వీడియో వైరల్.. ఆ కోరిక ఎట్టకేలకు `పీకే`తో తీరిందట!
అనుష్క శర్మ.. అమీర్ ఖాన్తో దర్శకత్వంలో రాజ్కుమారి హిరానీ దర్శకత్వంలో `పీకే` చిత్రంలో నటించింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కానీ అంతకు ముందే అంటే `3 ఇడియట్స్`లో చేయాల్సి ఉందట. తాజాగా తన ఆడిషన్ వీడియో వైరల్గా మారింది.
అనుష్క శర్మ బాలీవుడ్లో తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ని, నటిగా ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. రెగ్యూలర్ కమర్షియల్ సినిమాల అనేదానికి అతీతంగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ రాణించింది.
కమర్షియల్ సినిమా అయినా, అందులో తన పాత్ర బలంగా, ప్రయారిటీ ఉండేలా చూసుకుంది అనుష్క. అలాంటి పాత్రలే చేసేది. అందుకే తాను స్పెషల్గా నిలిచింది.
బాలీవుడ్ విలక్షణ దర్శకుడు రాజ్కుమార్ హిరానీతో అమీర్ ఖాన్ నటించిన `3ఇడియట్స్`(2009) చిత్రంలో నటించాల్సి ఉండే. ఆ సినిమాకి ఆడిషన్ కూడా వెళ్లింది అనుష్క. కానీ అది వర్కైట్ కాలేదు. కానీ ఆ ఆడిషన్ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
బ్లూ డ్రెస్లో ఉన్న అనుష్మ శర్మ `మున్నాభాయ్ ఎంబీబీఎస్`లోని మోనోలాగ్ డైలాగ్ చెబుతూ ఆడిషన్ ఇచ్చారు. ఈ ఆడిషన్ వీడియో ఇప్పుడు అనుష్క ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇందులో అనుష్క కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, అనుష్క చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. కాకపోతే సెటిల్డ్ గా కనిపించింది అనుష్క. బహుశా దీనివల్లే ఆమె ఎంపిక కాలేదేమో.
అనుష్క స్థానంలో ఈ సినిమాలో కరీనా కపూర్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, షర్మన్ జోషి, కరీనా కపూర్ నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కరీనా నటనకు ప్రశంసలు దక్కాయి.
అయితే అప్పుడు మిస్ అయ్యింది కానీ ఐదేళ్ల తర్వాత వర్కౌట్ అయ్యింది. 2014లో వచ్చిన `పీకే` చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది అనుష్క శర్మ. ఇందులో జర్నలిస్ట్ గా కనిపించి ఆకట్టుకున్నారు. అమీర్ ఖాన్ని గైడ్ చేస్తూ అనుష్క కనిపించింది. ఇక సమాజంలోని మూఢ విశ్వాసాలను అమీర్ పాత్రతో కడిగి పడేశారు దర్శకుడు రాజ్కుమార్ హిరానీ. ఈ సినిమా దాదాపు ఐదు వందల కోట్లు వసూలు చేయడం విశేషం.
మొత్తానికి అమీర్ ఖాన్తో కలిసి నటించాలనే కోరిక, రాజ్ కుమార్ హిరానీలాంటి దర్శకుడితో పనిచేయాలనే ఆసక్తి `పీకే`తో నెరవేరిందని చెప్పొచ్చు. అనుష్క శర్మ చివరగా `జీరో` చిత్రంలో షారూఖ్తో కలిసి నటించింది. ఈ అమ్మడు తన కెరీర్ని ప్రారంభించింది కూడా షారూఖ్తోనే కావడం విశేషం. 2008లో `రబ్ నే బనా ది జోడి` చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క.
అనుష్క శర్మ భారత క్రికెట్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017లో ఇటలీలో వీరి వివాహం అత్యంత గ్రాండీయర్గా జరిగింది. ఈ ఏడాది జనవరిలో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది అనుష్క. ఆ పాపకి `వామిక` అని నామకరణం చేశారు.