అనుష్క నుండి అనసూయ వరకు... వేశ్య పాత్రలు చేసిన డేరింగ్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?
అనసూయ, అనుష్క శెట్టితో పాటు కొందరు హీరోయిన్స్ వేశ్య పాత్రలు చేశారు. వీరిలో హోమ్లీ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వేశ్య పాత్రలు చేసిన డేరింగ్ హీరోయిన్స్ ఎవరు? సదరు చిత్రాలు ఏమిటో? చూద్దాం...
Anasuya Bharadwaj
కొన్ని పాత్రలు చేయాలంటే ధైర్యం ఉండాలి. ప్రేక్షకులు ఏమనుకున్నా పర్లేదనే తెగువ ఉండాలి. సమాజం తప్పుడు భావనతో చూసే వేశ్య పాత్ర చేయడం అంటే కత్తి మీద సామే. వేశ్య పాత్రలో భిన్న షేడ్స్ ఉంటాయి. మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించాల్సి రావచ్చు. తేడా కొడితే మొత్తంగా కెరీరే తిరగబడుతుంది. ఇవేమీ లెక్క చేయని కొందరు హీరోయిన్స్ ఛాలెంజ్ అంగీకరించారు. సాహసోపేతమైన వేశ్య పాత్రలో నటించారు.
Anasuya Bharadwaj
అనసూయ విమానం చిత్రంలో వేశ్య పాత్ర చేసింది. వెయ్యి రూపాయలు ఇస్తే ఎవడైనా ఓకే అంటూ బోల్డ్ రోల్ లో రచ్చ చేసింది. అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి.
Anasuya Bharadwaj
దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వేదం క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. అల్లు అర్జున్, మంచు మనోజ్ హీరోలుగా నటించిన ఈ మూవీలో అనుష్క వేశ్య పాత్ర చేసింది.
వేశ్యగా నటించిన మరో స్టార్ లేడీ శ్రియా శరన్. కెరీర్ కొంచెం డౌన్ అయ్యాక శ్రియా వేశ్య పాత్ర చేశారు. పవిత్ర టైటిల్ తో తెరకెక్కిన మూవీలో శ్రియ వేశ్యగా నటించారు.
హోమ్లీ హీరోయిన్ స్నేహ వేశ్యగా నటించి ఊహించని షాక్ ఇచ్చారు. 2006లో ధనుష్ హీరోగా విడుదలైన ధూల్ పేట్ మూవీలో స్నేహ వేశ్య పాత్ర చేశారు.
దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ జ్యోతిలక్ష్మి. ఛార్మి ప్రధాన పాత్ర చేసింది. ఈ మూవీలో ఛార్మి కెరీర్లో ఫస్ట్ టైం వేశ్యగా కనిపించి అలరించారు.
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ పంచ తంత్రం. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వేశ్య పాత్ర చేశారు.
స్టార్ కిడ్ శృతి హాసన్ హిందీ మూవీ 'డి డే'లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చారు. మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ని ఉద్దేశిస్తూ తెరకెక్కిన డి డే మూవీలో శృతి హాసన్ పాకిస్తాన్ కి చెందిన వేశ్యగా నటించారు.
బాలయ్య నటించిన భక్తిరస చిత్రం పాండురంగడు. దర్శకుడు కే రాఘవేంద్రరావు బాలయ్య-టబు మధ్య మితిమీరిన శృంగార సన్నివేశాలు తెరకెక్కించారు. ఆ మూవీలో టబు ది వేశ్య పాత్ర.
తెలుగు భామలు అంజలి, బిందు మాధవి వేశ్య పాత్రలు చేశారు. డేర్ మూవీలో అంజలి వేశ్యగా కనిపించారు. బిందు మాధవి సెగ చిత్రంలో వేశ్యగా నటించారు.
అలనాటి తారలు సైతం ఇలాంటి పాత్రలు చేయడానికి వెనుకాడలేదు. ప్రేమాభిషేకం మూవీలో జయసుధ, మేఘ సందేశం మూవీలో జయప్రద వేశ్య పాత్రలు చేశారు. ఈ రెండు చిత్రాల్లో ఏఎన్నార్ హీరోగా చేశారు.