32 ఏళ్ళ క్రితం ఆంధ్రాలో దిగిన బాలీవుడ్ హీరో, తెలుగు హీరో క్రేజ్ చూసి మెంటలెక్కిందట
టాలీవుడ్ లో చరిత్ర సృష్టించే చిత్రాలు అప్పుడప్పుడూ రిలీజ్ అవుతుంటాయి. గతంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు తమ చిత్రాలతో టాలీవుడ్ మార్కెట్ ని, బిజినెస్ వాల్యూని పెంచుతూ వచ్చారు.

Anil kapoor, Chiranjeevi
టాలీవుడ్ లో చరిత్ర సృష్టించే చిత్రాలు అప్పుడప్పుడూ రిలీజ్ అవుతుంటాయి. గతంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు తమ చిత్రాలతో టాలీవుడ్ మార్కెట్ ని, బిజినెస్ వాల్యూని పెంచుతూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అనేక ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటించారు. వాటిలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఘరానా మొగుడు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
ఘరానా మొగుడు మొగుడు చిత్రం అనేక రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో తొలి 10 కోట్ల షేర్ వసూలు చేసిన చిత్రం ఇదే. తమిళంలో ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటించారు. తమిళంలో మన్నన్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు ఒకేసారి తమిళం తెలుగు చిత్రాలు తెరకెక్కాయి. దక్షిణాదిలో తొలి 10 కోట్ల షేర్ రాబట్టిన చిత్రం కూడా ఘరానా మొగుడే.
అప్పటి వరకు టాలీవుడ్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన చిత్రం కూడా ఇదే. గుంటూరులో ఈ చిత్ర విజయోత్సవ వేడుక నిర్వహించారు. వర్షం పడినప్పటికీ విజయోత్సవ వేడెక్కి జనసందోహం ఆగలేదు. ఆ ఈవెంట్ కి దాదాపు 6 లక్షల మంది అభిమానులు హాజరైనట్లు అంచనా.
ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ గుంటూరు వచ్చారు. చిరంజీవి కోసం వచ్చిన అభిమానులని చూసి నాకు మెటలెక్కింది అని అన్నారు. మరొక మాట కూడా అనిల్ కపూర్ అన్నారు. నేను కూడా ఆంధ్రలో పుట్టి ఉంటే బావుండేది అని అన్నారట.
Chiranjeevi
ఈ చిత్రంలో క్లెమాక్స్ ఫైట్ కోసం ముంబై నుంచి ప్రత్యేక ఫైట్ మాస్టర్ల బృందం వచ్చిందట. ఫైర్ నేపథ్యంలో ఫైట్ ఉంటుంది. దీనికోసం 78 సిలిండర్లని వాడినట్లు తెలుస్తోంది. ఆ ఫైట్ చిత్రీకరణ కోసం 17 రోజుల సమయం పట్టిందట. 32 ఏళ్ళ క్రితమే ఈ చిత్రం నైజాం ఏరియాలో ఏకంగా 50 పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది.