బిత్తిరి సత్తి ఛాలెంజ్... స్వీకరించిన ఇస్మార్ట్ సావిత్రి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శివ జ్యోతి (ఇస్మార్ట్ సావిత్రి) మొక్కలు నాటారు.
హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శివ జ్యోతి (ఇస్మార్ట్ సావిత్రి) మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ మూడో సీజన్లో భాగంగా యాంకర్ బిత్తిరి సత్తి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటారు శివ జ్యోతి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎంపీ సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. తనకు ఈ చాలెంజ్ బిత్తిరి సత్తి ఇవ్వడం జరిగిందని... ఆయన చాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు ఈ మొక్కను నాటే కార్యక్రమం చేపట్టానని అన్నారు.
అదేవిధంగా ఈ మొక్కలు పెంచే బాధ్యత కూడా తానే తీసుకుంటాను అని తెలిపారు. ఈ సందర్భంగా మొక్కలు నాటాలని మరోక ముగ్గురికి చాలెంజ్ ఇచ్చారు. బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ఆశురెడ్డి, రోహిణిలకు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని శివజ్యోతి విజ్ఞప్తి చేశారు.