ఎంతో ఏడిపించా.. నా కోసం అన్నీ భరించావ్.. ఎమోషనల్ అయిన యాంకర్ రవి
వినాయక చవితి సందర్భంగా జీ తెలుగులో బాపు బొమ్మకి పెళ్లంట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ షోలో నిహారిక, నాగబాబు, అనసూయ, జానీ మాస్టర్, బాబా బాస్కర్, రవి, ప్రదీప్, ధనరాజ్, భాను శ్రీ , విష్ణు ప్రియలతో పాటు మరికొంత మంది టెలివిజన్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదిక మీదే తన జీవితంలో జరిగిన కొన్ని ఇబ్బందికర సంఘటనలను వివరిస్తూ తన భార్యను క్షమాపణలు కోరాడు రవి.
సినిమా ఇండస్ట్రీతో పాటు టీవీ రంగంలోనూ కాంపిటీషన్ను తట్టుకొని నిలబడటం అంత సులభం కాదు. అందుకే బుల్లితెర స్టార్స్ కూడా తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. కెరీర్ సాఫిగా సాగటం కోసం తమ పర్సనల్ లైఫ్ను కూడా త్యాగం చేస్తుంటారు. తాజాగా అలా తన జీవితంలో జరిగిన సంగటనను వెల్లడించాడు స్టార్ యాంకర్ రవి.
వినాయక చవితి సందర్భంగా జీ తెలుగులో బాపు బొమ్మకి పెళ్లంట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ షోలో నిహారిక, నాగబాబు, అనసూయ, జానీ మాస్టర్, బాబా బాస్కర్, రవి, ప్రదీప్, ధనరాజ్, భాను శ్రీ , విష్ణు ప్రియలతో పాటు మరికొంత మంది టెలివిజన్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదిక మీదే తన జీవితంలో జరిగిన కొన్ని ఇబ్బందికర సంఘటనలను వివరిస్తూ తన భార్యను క్షమాపణలు కోరాడు రవి.
ఈ షోలో రవి మాట్లాడుతూ.. `నాకు పెళ్లై 8 సంవత్సరాలు అయ్యింది. కానీ ఈ విషయం ప్రపంచానికి తెలిసింది మాత్రం ఏడాదిన్నర క్రితమే, అంతుకు ముందు ఆరున్నరేళ్లు నా భార్య నన్ను ఎంతో భరించింది. ఎంతో టార్చర్ అనుభవించింది. కానీ ఆ విషయాలు ఎప్పుడు నాకు చెప్పలేదు. నేను ఇండస్ట్రీలో మంచి స్థాయిలో కొనసాగాలి అంటే తాను ఇవన్నీ భరించాలి అర్ధం చేసుకుంది.
నా పని ఒత్తిడి వల్ల ఆమెను చాలా ఇబ్బంది పెట్టా.. రాత్రుళ్లు నిద్ర పోకుండా ఏడుస్తూ ఉండేది. ఆ విషయం నాకు తెలిసినా పట్టించుకోలేదు. తానే కష్టపడి నా ఫ్యామిలీని నిలబెట్టింది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నా భార్య నీతూ సక్సెనానే` అంటూ తన కెరీర్ నిలబెట్టేందుకు భార్య ఎంత కష్టపడిందో వివరించాడు రవి.
అంతేకాదు వేదిక మీద నుంచే భార్యను క్షమాపణలు కూడా కోరాడు. `నిన్ను బాధపెట్టినందుకు క్షమించు నీతూ, నువ్వు ఇది చూస్తావ్ అని తెలుసు, అందుకే నన్ను క్షమించు. అంటూ` వేదిక మీద మోకాళ్లపై కూర్చొని, కన్నీళ్లు పెట్టుకున్నాడు.