ఇది మానవజాతికి హెచ్చరిక... భయపెడుతున్న యాంకర్ రష్మీ సోషల్ మీడియా పోస్ట్!
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కి ఆకర్షించే అందమే కాదు, మంచు లాంటి మంచి మనసు, సామాజిక స్పృహ ఉన్నాయి. సామాజిక విషయాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించే రష్మీ మంచి విషయాలను ప్రోత్సహించడం, చెడ్డ విషయాలను విమర్శించడం చేస్తూ ఉంటారు.
జంతు ప్రేమికురాలిగా వీధి కుక్కలకు రష్మీ ఆహారం అందిస్తూ ఉంటారు. ఎవరైనా వాటి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే, వాళ్ళను ఏకిపారేస్తూ ఉంటారు. రష్మీ సామాజిక స్పృహ అనేక మార్లు ప్రశంసలు అందుకుంది.
తాజాగా మెక్సికో దేశంలో జరిగిన ఓఘటనపై రష్మీ తనదైన శైలిలో స్పందించారు. కొద్దిరోజుల క్రితం ఆ దేశంలోని పంట పొల్లాలో చిన్న రంధ్రం ఏర్పడింది. ఉరుములు మెరుపుల సమయంలో ఏర్పడిన ఈ రంధ్రం నుండి నీటి బుడగలు వచ్చాయట.
క్రమేణా ఆ రంధ్రం పెరుగుతూ పోతుందట. అలా పెద్దది అవుతున్న ఆ సింక్ హోల్ దాదాపు వంద మీటర్ల వ్యాసార్ధానికి చేరుకుందని తెలుస్తుంది. అక్కడ భూమి ఎందుకురా అలా చొచ్చుకుపోతుందో అర్ధం కావడం లేదు.
భూమి మానవులకు ఇచ్చిన మరో హెచ్చరిక కావచ్చు. మనుషుల ప్రవర్తనతో విసిగిపోయిన భూమాత ఇలా ప్రవర్తిస్తుంది అంటూ... రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పర్యావరణం పట్ల భాద్యత లేకుండా ప్రవర్తిస్తూ, అభివృద్ధి పేరుతో సహజ వనరులను, జీవజాతిని నాశనం చేస్తున్న మనుష్య జాతికి భూమాత నుండి ప్రమాద హెచ్చరిక అని అర్ధం వచ్చేలా రష్మిక తన పోస్ట్ లో వివరించారు.
ఇక ఆ విషయం అలా ఉంచితే రష్మీ కింగ్ నాగార్జున మూవీలో కీలక రోల్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోగ్గాడే చిన్ని నాయనా మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు మూవీలో రష్మిక మంచి అవకాశం పట్టేశారట.
రష్మిక నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది.నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ పల్లెటూరి అమ్మాయిగా డీగ్లామర్ రోల్ చేశారు.