సుధీర్ ప్రపోజల్కి పరవశించిపోయి గుండెలపై వాలిపోయిన రష్మీ.. ఏకంగా స్టేజ్పైనే..
సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ల మధ్య లవ్ స్టోరీ పీక్లోకి వెళ్లింది. స్టేజ్పైనే ప్రపోజ్ చేసేకునే స్టేజ్కి చేరుకున్నారు. తాజాగా వీరిద్దరి ఒకరికొకరు రోజా పువ్వు ఇచ్చుకుని మరీ తమ లవ్ ప్రపోజ్ చేసుకోవడం, దీనికి రష్మీ సుధీర్ గుండెలపై వాలిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
టీవీ షోస్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ మధ్య కెమిస్ట్రీకి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరు `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `ఢీ` షోలలో రెచ్చిపోతుంటారు. తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెడుతుంటారు. ఇప్పుడు మరోసారి తమ ప్రేమని బహిరంగంగా వ్యక్తం చేసుకున్నారు.
`ఢీ` షోలో వీరిద్దరు రెచ్చిపోయారు. ఒకరికొకరు రోజా పువ్వు ఇచ్చిపుచ్చుకున్నారు. డ్యూయెట్లు పాడుకున్నారు. తాజాగా ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మొదట సెక్సీ యాంకర్ రష్మీనే రాజా పువ్వుని తీసుకుని సుధీర్ వద్దకు వచ్చి మరీ ఆయనకు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. మరోవైపు దీపికా పిల్లి సైతం హైపర్ ఆదికి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసింది.
దీనికి సుడిగాలి సుధీర్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రష్మీ ఇచ్చిన ఫ్లవర్ తీసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. అంతటితో ఆగలేదు. తాను కూడా రెచ్చిపోయాడు.
అమ్మాయి రష్మీనే ఇంతగా తన వద్దకు వచ్చి ప్రపోజ్ చేయడంతో తానేమి తక్కువ కాదని నిరూపించాడు.తాను కూడా ఓ రోజా పువ్వుని తీసుకుని రష్మీ వద్దకు వెళ్లి ప్రపోజ్ చేశాడు. అలాగే హైపర్ ఆది కూడా దీపికా వద్దకి వెల్లి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు.
వీరిద్దరు రష్మీ చేయి పట్టుకుని సుధీర్, దీపికా పిల్లి కొంగు పట్టుకుని ఆది స్టేజ్పైనే అటు ఇటూ తిరిగారు. ఈ సెక్సీ భామలు వయ్యారాలు ఒలకబోస్తుండగా, వారి నడుము ఊపులను చూస్తూ పరవశించిపోయారు.
ఇక రష్మీ, సుధీర్ ఓ అడుగు ముందుకేసి డ్యూయెట్ పాడుకున్నారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని చూపులు చూపులు కలుసుకున్న శుభవేళ డ్యూయెట్ ఏసుకున్నారు.
సుధీర్ ప్రపోజల్కి పరవశించిపోయిన రష్మీ ఆయన గుండెలపై వాలిపోయింది.
సుధీర్ సైతం ఆమెని తన చేతుల్లోకి తీసుకుని అలా రొమాంటిక్ పోజ్లోకి వెళ్లిపోయారు. ఇద్దరు లవర్స్ వేసే ఫేమస్ యాంగిల్లోకి వెళ్లిపోయారు.
అయితే సుధీర్, రష్మీ రెచ్చిపోయారు. స్టేజ్పైనే హగులు చేసుకుంటూ తమ ప్రేమలో మునిగిపోయారు. అంతా చూస్తుండగానే అన్నీ మర్చిపోయి రొమాన్స్ కి తెరలేపారు.
దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి, షాక్కి గురయ్యారు. జడ్జ్ గా ఉన్న పూర్ణ అయితే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వారి చేష్టలు చూడలేక మతిపోయినట్టయ్యింది.
ఈ డాన్స్ షో ఈ నెల 7న ప్రసారం కానుంది. ఇందులో రష్మీ, దీపికా పిల్లి క్వీన్స్ టీమ్కి లీడర్స్ గా ఉంటే, సుధీర్, హైపర్ ఆది కింగ్ టీమ్కి లీడర్స్ గా ఉన్నారు. పూర్ణ, ప్రియమణి, జడ్జ్ లుగా ఉన్నారు. అయితే ఈ షోలో మాత్రం సంగీత కూడా గెస్ట్ జడ్జ్ గా పాల్గొని సందడి చేశారు.