- Home
- Entertainment
- Anasuya Complaints to Allu Arjun: అల్లు అర్మీపై బన్నీకి యాంకర్ అనసూయ ఫిర్యాదు.. ఐటెమ్ సాంగ్ కోసం రిక్వెస్ట్
Anasuya Complaints to Allu Arjun: అల్లు అర్మీపై బన్నీకి యాంకర్ అనసూయ ఫిర్యాదు.. ఐటెమ్ సాంగ్ కోసం రిక్వెస్ట్
`జబర్దస్త్` యాంకర్ అనసూయ `పుష్ప` చిత్రంలో కీలక పాత్ర పోషించింది. దాక్షాయణిగా ఆమె కాసేపు కనువిందు చేసింది. అయితే తాజాగా అల్లు ఆర్మీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏకంగా అల్లు అర్జున్కే ఫిర్యాదు చేసింది. ఇంతకి ఏం జరిగిందంటే.

హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో తరచూ ట్రోల్స్ కి గురవుతుంటుంది. ఆమె డ్రెస్సులపై నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు. దీంతో దీనిపై అనసూయ కూడా స్పందిస్తూ వారికి సరైన వార్నింగ్ ఇస్తుంటుంది. అయితే ఇలా అల్లు అర్జున్ అభిమానుల విమర్శలకు కూడా గురైందట. అల్లు అర్మీ తనని బాగా తిట్టేశారట. ఏకంగా ఈ విషయాన్ని అల్లు అర్జున్కే చెప్పింది అనసూయ.
అల్లు అర్జున్, రష్మిక మందన్నాజంటగా నటించిన `పుష్ప` చిత్రం గత శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమా నాలుగు రోజుల్లో 203కోట్లు వసూలు చేసిందని టాక్. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం తిరుమతిలో గ్రాండ్ మాసివ్ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఇందులో బన్నీ, రష్మిక, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్,సునీల్,అనసూయ వంటి వారు పాల్గొన్నారు.
ఇందులో అనసూయ మాట్లాడుతూ ఆశ్చర్యకరమైన విసయాలను వెల్లడించారు. బన్నీతో చాలా మాట్లాడాలని స్టార్ట్ చేసిన అనసూయ.. ఓ సందర్భంలో అల్లు అర్మీ విమర్శలను ఎదుర్కొందట. అల్లు అర్మీ తనని బాగా తిట్టేశారని చెప్పింది. `అల్లు అర్మీ నన్ను బాగా తిట్టేశారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒక పద్ధతిలో చెప్పాను. కానీ వాళ్లు మరోలా తీసుకున్నారు. కానీ మీరు మీ పెద్ద హృదయాన్ని చాటుకున్నారు.
మీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు` అని తెలిపింది. ఈసందర్బంగా బన్నీ పాత్రలపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఎక్కడి ఐకాన్ స్టార్, ఎక్కడి పుష్ప, ఈ ట్రాన్స్ఫర్మేషన్ పై ఆమె ప్రశంసలు కురిపించింది.
ఇక `పుష్ప`లో తన రోల్ గురించి కంప్లెయింట్స్ ఉందట. తన పాత్రని చాలా తక్కువగా చూపించారని ఆమె బన్నీకి, సుకుమార్కి తెలిపింది. రెండో పార్ట్ లో మరింతగా చూపిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పింది అనసూయ. మొదటి భాగంలో తమ్ముడి పాత్ర వదిలి వెళ్లిన బ్లేడ్తో రచ్చ చేయబోతున్నట్టు తెలిపింది అనసూయ.
ఇదిలా ఉంటే ఈ వేదికగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, బన్నీకి ఓ రిక్వెస్ట్ చేసింది. తనని ఐటెమ్ సాంగ్లో చూపిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పింది. కానీ తనని ఇలాంటి డిఫరెంట్స్ రోల్స్ లో చూపిస్తున్నారని సుకుమార్కి తెలిపింది. తాను ఐటెమ్ సాంగ్ చేయాలనుకుంటున్నట్టు, అది కూడా అల్లు అర్జున్తో, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్లో చేయాలనుకుంటున్నట్టు తన మనసులో మాటని బయటపెట్టిందీ హాట్ యాంకర్.
`జబర్దస్త్`లో కనిపించే అనసూయగా కాకుండా ఓ రంగమ్మత్తగా, ఓ దాక్షాయణిగా తనని పిలిచేలా చేసినందుకు, అలా తనని గుర్తుపెట్టుకుంటున్నందుకు దర్శకుడు సుకుమార్కి థ్యాంక్స్ చెప్పింది అనసూయ. ప్రస్తుతం ఆమె `జబర్దస్త్` షోతోపాటు `మాస్టర్ చెఫ్` షోకి హోస్ట్ గా చేస్తుంది. ఇక వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.