- Home
- Entertainment
- మళ్లీ మొదలెట్టిన అనసూయ.. శివాజీ పై సెటైర్లు ఇప్పట్లో ఆగేట్టు లేదుగా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మళ్లీ మొదలెట్టిన అనసూయ.. శివాజీ పై సెటైర్లు ఇప్పట్లో ఆగేట్టు లేదుగా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
అయిపోయిందనుకున్న వివాదం మళ్లీ మొదలయ్యింది. ఆమధ్య శివాజీ కామెంట్స్, అనసూయ కౌంటర్లు ఎంత సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో తెలిసిందే. ఇక అంతా సర్ధుమణిగింది అనుకున్న టైమ్ లో.. అనసూయ మళ్లీ మొదలెట్టింది..

శివాజీ vs అనసూయ
రీసెంట్ గా లేడీస్ డ్రెస్సింగ్ స్టైల్ పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారమే రేపాయి.. చాలామంది సెలబ్రిటీలు ఈ విషయంలో శివాజీని విమర్శించారు. అందులో యాంకర్ అనసూయ అయితే పెద్ద యుద్దమే చేసింది. నెటిజన్ల నుంచి వ్యతిరేకత వచ్చినా.. తగ్గలేదు స్టార్ యాంకర్. శివాజీ పై ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయింది. ఇండస్ట్రీలో కూడా ఈ విషయం పెద్ద దుమారమే రేపింది.
సోషల్ మీడియావార్
ఈ వివాదంలో కొంత మంది శివాజీకి సపోర్ట్ చేయగా.. మరికొంత మంది మాత్రం ఆయన్ను విమర్శించారు. శివాజీ vs అనసూయ గా మారి తెగ హడావిడి చేశారు. ఇక ఈ సోషల్ మీడియావార్ లో నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
దుమారం రేపిన శివాజీ కామెంట్స్..
‘దండోరా’ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ, మహిళలు నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, శరీరం కనిపించేలా దుస్తులు ధరించడం సరైంది కాదని కామెంట్స్ చేశారు.. అంతేకాదు, అలాంటి దుస్తులు వేసుకునే వారిపై ప్రజలు బయట నవ్వినా, లోపల మాత్రం విమర్శిస్తారని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.
అయిపోయిందనుకుంటే మళ్లీ మొదలయ్యింది..
ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ భరద్వాజ్, మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది వారి వ్యక్తిగత ఎంపిక అని స్పష్టం చేశారు. అసలు సమస్య దుస్తుల్లో లేదని, పురుషుల ఆలోచనా విధానం, మహిళల పట్ల ప్రవర్తనలో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె అభిప్రాయానికి అనేక మంది సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు సపోర్ట్ తెలిపారు. కొన్ని రోజులు ఇలానే కొనసాగిన వివాదం.. ఆతరువాత సర్దుమణుగుతూ వచ్చింది.
అనసూయ పోస్ట్ తో మొదలయైన రచ్చ..
ఇక ఈ వివాదం అయిపోయినట్టే అనుకుంటున్న టైమ్ లో తాజాగా అనసూయ చేసిన పోస్ట్ మళ్లీ రచ్చకు దారి తీసింది. ఒక వీడియోతో మళ్లీ ఈ వివాదాన్ని మొదలు పెట్టింది అనసూయ. ఆ వీడియోలో ఆమె సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని తన భర్తతో కలిసి కనిపించారు. ఈ వీడియోను ఒక న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “శివాజీ దెబ్బతో పట్టుచీరలో తిరుగుతున్న అనసూయ” అంటూ క్యాప్షన్ ఇవ్వడం కొత్త వివాదానికి దారితీసింది. దీనిపై స్పందించిన అనసూయ తనదైన మార్క్ లో కౌంటర్ ఇచ్చింది.
శివాజీ సృష్టించిన చీర అంటూ సెటైర్లు..
అనసూయ పోస్ట్ లో ఏముందంటే.. “తప్పు తప్పు.. ‘శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ’ అని కదా హెడ్డింగ్ ఉండాలి. ఎందుకంటే అంతకుముందు మేమంతా అసలు చీరలే కట్టుకోలేదు” అంటూ ఆమె సెటైరికల్గా స్పందించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనసూయ తన కామెంట్ సెక్షన్ను లాక్ చేయడంతో నెటిజన్లు స్పందించే అవకాశం లేకుండా పోయింది. మరి ఈ వివాదం మళ్ళీ ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి.

