AmalaPaul: హిమాలయాల్లో గొర్రెల కాపరిగా మారిన అమలాపాల్.. బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
కెరీర్ ఆరంభంలో కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసిన హీరోయిన్ అమలాపాల్. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.

కెరీర్ ఆరంభంలో కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసిన హీరోయిన్ అమలాపాల్. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో Amala Paul న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.
అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది.
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం అమలాపాల్ హిమాలయాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ నేచర్ ని ఆస్వాదిస్తోంది.
అమలాపాల్ షేర్ చేసిన పిక్స్ అందంగా క్యూట్ గా ఉన్నాయి. అక్కడ కనిపించిన గొర్రె పిల్లలు, జంతువులతో ఆడుకుంటూ సంబరపడుతోంది ఈ హాట్ బ్యూటీ. గొర్రెలు మేకలు కాస్తూ కాపరిలా వ్యవహరిస్తన్న ఫోటోలని షేర్ చేసింది.
ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే.
2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.