వెబ్ సిరీస్లో మరింత బోల్డ్గా.. న్యూడ్ షో తరువాత అమలా పాల్!
తాజాగా అమలా పాల్ కూడా డిజిటల్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. అది కూడా ఓ బోల్డ్ వెబ్ సిరీస్లో అమలా పాట్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుందట. హిందీలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ను మహేష్ భట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది.
లాక్ డౌన్ సినిమా రంగంలో కొత్త దారులు తెరిచింది. ప్రస్తుతం థియేటర్లు నడిచే పరిస్థితి లేకపోవటంతో అంతా ఓటీటీలవైపు చూస్తున్నారు. డిజిటల్ రంగం కూడా శరవేగంగా అభివృద్ది చెందుతుండటం, మార్కెట్ పరంగా కూడా భారీ స్థాయిలో బిజినెస్ చేస్తుండటంతో స్టార్స్ కూడా వెబ్ సిరీస్లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే డిజిటల్కు సెన్సార్ నిబంధనలు లేకపోవటంతో ఎక్కువగా బోల్డ్ కంటెంటే రూపొందిస్తున్నారు మేకర్స్.
ఈ నేపథ్యంలో తాజాగా అమలా పాల్ కూడా డిజిటల్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. అది కూడా ఓ బోల్డ్ వెబ్ సిరీస్లో అమలా పాట్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుందట. హిందీలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ను మహేష్ భట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది.
పీరిడియాక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 1970 బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమలా పాల్ హాట్ హాట్ సీన్స్లో కనిపించనుందన్న టాక్ వినిస్తోంది. ఈ షోలో అమలతో పాటు తహిర్ రాజ్ బసిన్, అమృత పూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఆమె సినిమాతో న్యూడ్గా నటించి అందరికీ షాక్ ఇచ్చింది అమలా పాల్. గతంలో కేవలం గ్లామర్ క్యారెక్టర్స్ కు మాత్రమే పరిమితమైన అమలా, విడాకుల తరువాత స్పీడు పెంచింది. పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ తోపాటు బోల్ఢ్ సీన్స్కు కూడా సై అంటోంది.
దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకునే ఓ వ్యక్తి, ఓ స్టార్ హీరోయిన్ల మధ్య ప్రేమ కథగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. మహేష్ భట్ తొలిసారిగా ఓ నటి జీవితం నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది మొదట్లోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చాడు మహేష్ భట్.