Aishwarya Rajesh : కాశ్మీర్ అందాలను చూపిస్తున్న ‘ఐశ్వర్య రాజేశ్’..!
ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే, ఏ జానర్ చిత్రానికైనా శక్తివంచన లేకుండా కష్టపడే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెకేషన్ లో సరదగా గడుపుతున్నది. ఎప్పటికప్పుడు తన అప్టేడ్స్ ను ఫ్యాన్స్ తో పంచుకునే ఐశ్వర్య కాశ్మీర్ అందాలను తన అభిమానులకు చూపిస్తోంది.
అద్భుతమైన నటనకు కేరాఫ్గా నిలిచే ఈ డస్కీ అందాల భామ తన గ్లామర్ను చూపించడమే కాకుండా, కాశ్మీర్ నేచర్ అందాలను కూడ చూపిస్తోంది. ఇటీవల తన ప్రతి మూమెంట్ ను తన అభిమానులతో పంచుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తన స్నేహితులు, రిలేటీవ్స్ తో కాశ్మీర్ కు వెళ్లింది.
అక్కడి అందాలను వీడియో, ఫొటోల రూపంలో తన అభిమానులతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఐశ్వర్య రాజేష్. మంచు తెరలో వెన్నెల ఉన్న ఐశ్వర్య, బ్లాక్ అండ్ కాఫీ కలర్ గౌన్ కోట్ లో చాలా అ్రటాక్టీవ్ గా కనిపిస్తోంది. కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో మతిపోయే స్టిల్స్ తో ఫొటోలు దిగి తన అభిమానులతో పంచుకుంది. ‘బ్యూటీ ఫుల్ కాశ్మీర్’ అంటూ తన ఫీలింగ్ ను తెలిపింది.
ట్రెండీవేర్ల్లో మరీ అందంగా కనపిస్తోంది ఐశ్వర్య. ప్రస్తుుతం ఈ తాజా గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. అయితే ఇన్నాళ్లు కాస్త ట్రెడిషనల్గా కనిపించిన ఐశ్వర్య కొంత కాలంగా చాలా ట్రెండీ లుక్ లో కనిపిస్తూ అభిమానులను షాక్ కు గురిచేస్తోంది.
తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉన్న ఈ బ్యూటీ తన కేరీర్ పట్ల పెద్ద స్కేచ్ వేసినట్టు తెలుస్తోంది. తమిళంలో మాత్రమే కాకుండా సౌత్ మొత్తంలో పాగా వేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది. అభినయం, అందంతో ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసేందుకు రెడీ అవుతుంది.
ఐశ్వర్యా రాజేష్ అంటే అద్భుతమైన నటనకు కేరాఫ్. పాత్ర ఏదైనా రక్తికట్టించడంలో ముందుంటుందనే పేరుంది. అంతేకాదు అనేక పాత్రలతో ఆమె నిరూపించుకుంది. యంగ్ హీరోయిన్ అయినప్పటికీ పలు సినిమాల్లో బిడ్డకి తల్లిగానూ నటించి మెప్పించింది. వెండితెరపై తన విలక్షణతని చూపించింది. విమర్శకుల చేత ప్రశంసలందుకుంది.
తెలుగుకు చెందిన ఈ అందాల భామ తమిళంలో సెటిల్ అయ్యింది. కోలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు తెలుగులోకి వస్తుంది. టాలీవుడ్లో పాగా వేసేందుకు పక్కాగా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ఇప్పటికే ఐశ్వర్య రాజేష్ `కౌసల్య కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్` తెలుగు ప్రేక్షకులకు దగ్గరవగా.. ‘టక్ జగదీష్’, రిపబ్లిక్ లో కనిపించిన మరింత చేరువైంది. అప్పటి నుంచి ప్రటి సినీమాలో తనకు అవకాశం దక్కేలా పలు జాగ్రత్తలు తీసుకోంటందీ బ్యూటీ.
త్వరలో పవన్ కళ్యాణ్- రానా హీరోలుగా నటిస్తున్న `భీమ్లా నాయక్` చిత్రంలో హీరోయిన్గా, రానా సరసన నటిస్తుంది. ఇందులో పవన్తో నిత్యా మీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించనుంది ఐశ్వర్య.