`జయం`తర్వాత సదాకి ఆఫర్లు రాకుండా చేశారా? .. ఆ మూవీ సక్సెస్ అని కూడా చెప్పలేదా? తెరవెనుక కథ బయటపెట్టిన హీరోయిన్
`జయం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని మాయ చేసిన సదా.. ఆ సినిమా తర్వాత తనకు జరిగిన అన్యాయంపై స్పందించింది. ఆఫర్లు రాకుండా చేశారని షాకిచ్చింది.
Sadaa
సదా.. `జయం` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని స్టార్ అయిపోయింది. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది. పల్లెటూరి అమ్మాయి లెహంగా ఓణిలో ఆమె ఆడియెన్స్ ని మాయ చేసేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ ప్రారంభంలో ఆ స్థాయి హిట్ పడలేదు. కొంత గ్యాప్తో మళ్లీ సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్ తో పుంజుకుంది.
అయితే సదాకి `జయం` సక్సెస్ తర్వాత ఆఫర్లు రాలేదట. ఆమె మళ్లీ స్టడీస్ వైపు వెళ్లిందట. ఎందుకు అలా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు సినిమాలు చేయలేదనే దానికి క్లారిటీ ఇచ్చింది సదా. ఈ క్రమంలో ఆమె పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. తనది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదు. ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్న సమయంలో తేజ గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. `జయం`లో ఆఫర్ రావడం పెద్ద లక్కీగా భావిస్తున్నాం. అయితే `జయం` సినిమా హిట్ అని కూడా తనకు తెలియదట. ఆ సినిమా హిట్ అయ్యిందని కూడా తనకు ఎవరూ చెప్పలేదని తెలిపింది సదా.
Sadaa
తన నెంబర్ అయితే అందరి వద్ద ఉంది. కానీ పీఆర్ మెయింటేన్ చేయలేదు. అలా చేయాలని కూడా తెలియదు. అవకాశాలు రావడానికి సంబంధించి ఎవరిని అప్రోచ్ కావాలో కూడా తెలియదు. దీంతో నేను మళ్లీ స్టడీస్ వైపు వెళ్లిపోయా. ఆ సమయంలో ఐటీ రిలేటెడ్ స్టడీస్ చేస్తున్నా. మళ్లీ స్టడీస్ చేస్తున్నాను. నన్ను ఎవరూ సినిమా కోసం సంప్రదించలేదు. ఆ తర్వాత కలిసినప్పుడు మీ కోసం అడిగామని, మీ కాంటాక్ట్ దొరకలేదని చాలా మంది నిర్మాతలు చెప్పారు. అంటే నాకు ఆఫర్లు వచ్చాయి, కానీ నా వరకు రాలేద`ని చెప్పింది సదా.
ఈ క్రమంలో మధ్యలోనే కొందరు ఆమెకి ఆఫర్లు రాకుండా చేశారని అర్థమవుతుంది. కొంత గ్యాప్తో సదా మళ్లీ సినిమాలు చేసింది. `ప్రాణం`, `నాగ`, `దొంగా దొంగది`, `లీలా మహల్ సెంటర్`, `ఔనన్నా కాదన్నా`, `అపరిచితుడు`, `చుక్కల్లో చంద్రుడు`, `వీరభద్ర`, `టక్కరి`, `మైత్రీ` వంటి సినిమాల్లో మెరిసింది సదా. కానీ ఆమె తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడం, తగిన గుర్తింపు రాకపోవడానికి సంబంధించిన తనకు కూడా అర్థం కాలేదని చెప్పింది సదా. ఏం జరిగిందో అర్థం కాలేదు. చాలా మంది తనకు ఆఫర్ చేశామని అన్నారు, కానీ నా వరకు రాకపోవడమే వింతగా అనిపించింది.
రీఎంట్రీ సమయంలోనూ చాలా మంది నిర్మాతల నుంచి ఇలాంటి సమాధానమే వచ్చిందని చెప్పింది సదా. అంటే మొత్తంగా సదా వరకు వెళ్లకుండా మధ్యలోనే కొందరు కుట్ర చేశారని అర్థమవుతుంది. సదాకి తెలియకుండా ఆమె వెనుక ఏదో కుట్ర జరిగిందని తెలుస్తుంది. దానికి కారణం సినిమా బ్యాక్ గ్రాండ్ కాకపోవడం, సరైన పీఆర్ సిస్టమ్ బిల్డ్ చేసుకోకపోవడమే అని తెలుస్తుందని చెప్పింది. నాకు తెలిసిన వారిమీదనే నేను డిపెండ్ అయ్యానని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పింది సదా.
ప్రస్తుతం సదా రీఎంట్రీ తర్వాత సెలక్టీవ్గా సినిమాలు చేయడంతోపాటు టీవీ షోస్తో ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఆమె ఇటీవల `అహింస` అనే సినిమాలో నటించింది. దీంతోపాటు `ఆది కేశవ` మూవీలోనూ మెరిసింది. దీంతోపాటు `ఢీ` షోకి జడ్జ్ గా చేసింది. ఇప్పుడు `నీతోనే డాన్స్` షోకి జడ్జ్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది సదా. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో మరింతగా మెప్పిస్తుంది.