టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి షురూ... సెట్స్ లో చిరు,ఎన్టీఆర్, చరణ్, మహేష్, ప్రభాస్, రవితేజ, అఖిల్, రామ్..
కరోనా తల్లి కొంత శాంతించింది. దీనితో చిన్నగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిత్ర సీమలో సినిమా సందడి మొదలైంది. భారీ బడ్జెట్ నుండి చిన్న చిత్రాల వరకు షూటింగ్స్ మొదలుపెట్టాయి. టాలీవుడ్ లో నేడు ఒక్కరోజే చాలా సినిమాలు సెట్స్ పైకి వెళ్లాయి.
మహేష్ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రం కూడా నేడు షూటింగ్ని ప్రారంభించుకుంది. హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పరశురామ్ దీనికి దర్వకత్వం వహిస్తుంగా, కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఈసినిమాని వచ్చే సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.
జులై 10న ఆచార్య చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ధర్మస్థలి పేరుతో వేసిన భారీ ఆలయం సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. చిరంజీవి, చరణ్ పాల్గొంటుండగా... షూటింగ్ పూర్తి చేయనున్నారు.
మాస్ మహారాజ్ ఇటీవల తన 68వ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామారావు అనే టైటిల్ నిర్ణయించారు. నేటి నుండి ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో స్టార్ డైరెక్టర్ సురేంధర్ రెడ్డి ఏజెంట్ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నేడు సెట్స్ పైకి వెళ్లగా, నిరవధికంగా షూటింగ్ జరుపుకోనుంది. అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ లుక్ కేకగా ఉంది.
ఎనర్జిటిక్ హీరో రామ్ తన 19వ చిత్ర ప్రకటన చేశారు. తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ఇది తెరకెక్కతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా నేటి నుండి షూటింగ్ జరుపుకుంటుంది.
అలాగే వెంకీ-వరుణ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ 3, ఎన్టీఆర్-చరణ్ ల ఆర్ ఆర్ ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్ సెకండ్ వేవ్ తరువాత షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇలా కొంత గ్యాప్ తరువాత టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి నెలకొంది. పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.