అడల్ట్ సినిమాలకు ఓకే అంటున్న సీనియర్ స్టార్ హీరోయిన్
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఓటీటీల హవా కనిపిస్తోంది. కరోనా కారణంగా సినిమాలకు పూర్తిగా బ్రేక్ పడటంతో స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలొనే రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతోంది. అంతేకాదు బోల్డ్ క్యారెక్టర్స్ రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చేసింది ఈ హాట్ బ్యూటీ.
ఒకప్పటి గ్లామరస్ హీరోయిన్ రంభ ఇటీవల తన 10వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించిన రంభ అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.
రంభ ముందు అమృత అనే పేరుతో వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులో ఆ ఒక్కటి అడక్కు సినిమా తరువాత ఆ పేరును రంభగా మార్చుకుంది.
రంభ చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. కెనాడాకు చెందిన వ్యాపార వేత్తను వివాహం చేసుకున్న రంభ ప్రస్తుతం టోరెంటోలో నివసిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఓ వెబ్ సిరీస్లో రంభ కీలక పాత్రలో నటించనుందట. ఈ సినిమా అడల్ట్ కంటెట్తో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. యువత మీద మధ్యవయస్సు మహిళల ప్రభావం అన్న కాన్సెప్ట్తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.
రంభ రీ ఎంట్రీకి ఇలాంటి బోల్డ్ కంటెంట్ను ఎంచుకోవటంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కొత్త పాత్రలో రంభ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.