Actress Raasi : బాలయ్యకు నో చెప్పిన నటి రాశి..
నందమూరి బాలకృష్ణ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వరుస సినిమాలతో అభిమానులను, సినీ ప్రేక్షకులను ఎంతో ఖుషి చేస్తున్న బాలయ్య సినిమాకు నటి రాశి నో చెప్పిందట.. అసలేం జరిగిందంటే..
- FB
- TW
- Linkdin
Follow Us
)
నందమూరి బాలకృష్ణ మూవీల్లో మనకు మొదట గుర్తుకు వచ్చేది ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో 1990లో తెరకెక్కిన హిట్ చిత్రం ‘సమరసింహారెడ్డి’నే. బాలకృష్ణ-సిమ్రాన్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి 1999లో సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం, బాలయ్య నటనా విశ్వరూపం, బి.గోపాల్ డైరెక్షన్ ప్రతిభతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెట్టుుబడికి మూడింతల కాసుల వర్షం కురిపించింది.
మంచి మాస్ ఎలమెంట్స్ ఉండటంతో ఈ మూవీ అప్పట్లో కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. ఈ సందర్భంగా గతంలో ఈ హిట్ చిత్రంపై సీనియర్ నటి, ఒకప్పటి ఫ్యామిలీ హీరోయిన్ రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 1999లో సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలో మొదట హీరోయిన్గా రాశిని సంప్రదించగా దీనికి ఆమె నో చెప్పిందట. అదే సంవత్సరం రాశి నేటి గాంధీ, స్వప్న లోకం, డాడీ డాడీ, వీడు సామన్యుడు కాదు, తదితర సినిమాల్లో నటించింది.
అయితే రాశి ఈ మూవీ వదులుకోవడానికి గల కారణాలను గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ఈ సంక్రాంతి సందర్భంగా గతంలోని ఆమె వ్యాఖ్యలు వైరల్గా మారాయి. సమరసింహారెడ్డిలో మెయిన్ హీరోయిన్గా సిమ్రాన్ నటించింది. అయితే సిమ్రాన్ స్థానంలో మొదట హీరోయిన్ రాశిని అనుకున్నారట. అంతేకాదు దర్శకుడు ఆమెను సంప్రదించి కథ కూడా చెప్పాడంట.
కథలో సీతాకోకచిలుకకు సంబంధించిన ఓ సీన్ నచ్చక నటి రాశి బాలయ్య సినిమాకు నో చెప్పేసినట్టు పేర్కొంది. అయితే రాశి నో చెప్పగానే సమరసింహారెడ్డి మూవీలో హీరోయిన్లుగా సిమ్రాన్, సంఘవి, అంజలా జవేరిని సంప్రదించి చిత్రాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత రాశి పలువురి నుంచి సినిమాను వదులుకోవడం పట్ల విమర్శలు ఎదుర్కొన్నట్టు పేర్కొంది. 1991లో వచ్చిన ఆదిత్య 369లో ఒక రోల్ చేసింది. శుభాకాంక్షలు, గోకులంలో సీత, పెండ్లి పందిరి సినిమాల్లో తన నటనా శైలితో తెలుగు ప్రేక్ష కుల మన్నలు పొందింది. అప్పటి నుంచి వరుస సినిమాలతో అభిమానులను మెప్పించి ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
సౌందర్య తర్వాత తెలుగు ప్రేక్షకులకు తమ ఇంటి మనిషిగా అనిపించిన నటిమణి రాశి. ఒకప్పుడు తన నటనతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. అయితే 2004లో వచ్చిన వెంకీ సినిమా వరకు తను యాక్టివ్ గానే ఉంది. ఆ తర్వాత ఆర్యోగం బాగలేకపోవడంతో కొంత చురుకుగా వ్యవహరించడం తగ్గించారు. ఆ త్వరాత కొద్ది పాటి సినిమాల్లో కనిపించసాగారు.